English | Telugu

Karthika Deepam2 :కార్తీక్ ఎమోషనల్ స్టోరీ.. శ్రీధర్ మనసు కరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -439 లో..... దీప దగ్గరికి పారిజాతం వచ్చి ఏదో మాట్లాడాలని అనుకుంటుంది కానీ అప్పుడే కార్తీక్ వచ్చి.. ఇందాక నా భార్యని ఏదో అంటున్నావని అడుగుతాడు. నేనేం అన్నానని ఏం తెలియనట్లు అడుగుతుంది. ఏం చేసుకుంటావో చేసుకోరా ఏమైనా అంటే ముసలోడితో కొట్టిస్తావ్ అంతే కదా.. నీకు ఎవడు భయపడుతాడని కార్తీక్ ని రెచ్చగొట్టేలా పారిజాతం మాట్లాడుతుంది. సరే పారు మనిద్దరికి ఒక ఛాలెంజ్ అని కార్తీక్ అంటాడు.

ఛాలెంజ్ ఏంటో చెప్పరా.. అందులో నేను గెలిస్తే నాకు నువ్వు బంటు లాగా సేవలు చేస్తూ ఉండాలని పారిజాతం అంటుంది. పారిజాతం ని కార్తీక్ కి గుమ్మం బయటకు తీసుకొని వెళ్లి ఒక సర్కిల్ గీస్తాడు. రేపు ఉదయం నిన్ను తాత మెడపట్టి బయటకు గెంటేస్తే నువ్వుల ఈ సర్కిల్ లో ఉంటావ్.. అలా నేను చేస్తానని కార్తీక్ అంటాడు. అంత లేదని పారిజాతం అంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప ఇంటికి వెళ్తారు. నాన్న మీ పెళ్లి ఎప్పుడు? మా ఫ్రెండ్స్ అందరిని పిలవాలని కార్తీక్ ని శౌర్య అడుగుతుంది. కార్తీక్ కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు.. కానీ మా పెళ్లి జరుగుతుందని శౌర్యకి అయితే కార్తీక్ మాటిస్తాడు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. తన మాటలతో ఇంట్లో వాళ్ళని బాధపెట్టి వెళ్తుంది. ఆ తర్వాత పారిజాతం గదిలో కూర్చొని కార్తీక్ గాడు నన్ను ముసలోడితో తిట్టించే సంఘటనలన్నీ ఒక పేపర్ పై రాసుకుంటుంది. రేపు ఉదయం వరకు గదిలో నుండి బయటకు వెళ్లొద్దని నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడే శివన్నారాయణ పారిజాతం గది ముందుకి వచ్చి డోర్ కొడుతాడు. ఈ రోజు బయటకు రానని చెప్పడంతో మంచి పని అంటూ శివన్నారాయణ వెళ్లిపోతాడు.

ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి కార్తీక్ వెళ్తడు. ఈ టైమ్ అప్పుడు వచ్చావని శ్రీధర్ అడుగుతాడు. మాట్లాడాలని కార్తీక్ అనగానే పెళ్లికి రా అనే మాట తప్ప ఏదైనా మాట్లాడమని శ్రీధర్ అంటాడు. శ్రీధర్ సోఫా పై కూర్చొని ఉంటాడు కార్తీక్ కింద కూర్చుంటాడు.‌ పైన కూర్చొమని శ్రీధర్ అంటాడు. నాకు ఇక్కడే కంఫర్ట్ అని కార్తీక్ అంటాడు. ఇద్దరం కాసేపు ఎవరో తెలియనట్టు మాట్లాడకుందామని కార్తీక్ అంటాడు. సరే అని శ్రీధర్ అంటాడు. కార్తీక్ తన స్టోరి చెప్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.