English | Telugu

Karthika Deepam2 : బోర్డ్ మీటింగ్ కి పిలిచిన శివన్నారాయణ‌... సీక్రెట్ ప్లాన్ ని కార్తీక్ కనిపెట్టగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -211 లో.....దాస్ కుబీర్ గురించి ఆలోచస్తుంటే.. కాశీ వచ్చి చేతిలో ఉందేంటని అడుగుతాడు.ఏం లేదంటూ వెళ్ళిపోతాడు. మా నాన్న ఎవరినో వెతుకున్నాడని స్వప్నతో కాశీ అంటాడు. ఆ తర్వాత శివన్నారాయణ‌ దగ్గరికి సుమిత్ర వచ్చి.. కార్తీక్ పెళ్లి చేసుకున్న నుండి అసలు జ్యోత్స్న నిద్ర పోయింది లేదు. ఎప్పుడు చూసిన గదిలో లైట్ వేసి ఉంటుంది. దీనికి మీరే పరిష్కారం చూపాలి.. త్వరగా పెళ్లి చేసి అమెరికా పంపించాలని సుమిత్ర అనగానే.. నేను తన గురించే ఆలోచిస్తున్నాను.. రేపు నిర్ణయం తీసుకుంటానంటూ శివన్నారాయణ‌ దశరథ్ ని పిలుస్తాడు. రేపు బోర్డు మీటింగ్ అరెంజ్ చెయ్ అందరికి మెసేజ్ పెట్టమని చెప్తాడు.

మరొక వైపు కార్తీక్, దీప ఇద్దరు కలిసి భోజనం చెయ్యాలని అనసూయ, కాంచన ఇద్దరు ప్లాన్ చేస్తారు. ‌అందుకే ముందే భోజనం చేసి శౌర్యని పక్కకి తీసుకొని వెళ్లి భోజనం తినిపిస్తారు. కార్తీక్ ఒక్కడే భోజనం చేస్తూ బర్త్ డే రోజు కూడా ఒక్కడినే భోజనం చేస్తున్నానని కార్తీక్ ఫీల్ అవుతుంటే.. దీప పక్కన కూర్చొని భోజనం చేస్తుంది. దాంతో ప్లాన్ సక్సెస్ అంటూ అనసూయ, కాంచన ఇద్దరు అనుకుంటారు. దీపకి కార్తీక్ భోజనం వడ్డీస్తుంటే.. ఇద్దరు కలిసి భోజనం చేస్తుంటారు.

ఆ తర్వాత శౌర్యతో కార్తీక్ ని కార్తీక్ అని పిలువు.. నాన్న అని వద్దు అని కాంచన అంటుంది. మీ అమ్మ పిలవమని చెప్పేవరకు పిలవకు అని కాంచన, అనసూయ ఇద్దరు ప్లాన్ చెప్తారు. దానికి శౌర్య సరే అంటుంది. ఆ తర్వాత మావయ్య మీటింగ్ అని మెసేజ్ చేశాడని కాంచనకి కార్తీక్ చెప్తాడు. నేను సొంతంగా బిజినెస్ చేస్తాను. రేపు సిచువేషన్ బట్టి డిసైడ్ అవుతానని కార్తీక్ అనగానే.. వద్దు బాబు మీ తాతయ్య గారితో చెయ్యండి అని దీప అంటుంది. అప్పుడే శౌర్య వచ్చి.. కార్తీక్ రేపు స్కూల్ కి నన్ను తీసుకొని వెళ్తావా అని అనగానే.. అడుగుతుంది శౌర్య.. కార్తీక్ అంటుంది. అమ్మ, అనసూయ గారు అక్క, చెల్లి అనుకుంటున్నారు. వీళ్ళేదో సీక్రెట్ మిషన్ చేస్తున్నారు. సైలెంట్ గా అబ్సర్వ్ చెయ్యడం బెస్ట్ అని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.