English | Telugu

Karthika Deepam2: దీప కోసం లాయర్ దగ్గరికి వెళ్ళిన కార్తీక్.. న్యాయం గెలుస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -334 లో.. కార్తీక్ దగ్గరికి శ్రీధర్ వస్తాడు. మీరందరు వదిలేయాల్సింది నన్ను కాదు ఆ దీపని ఆ తర్వాత మనం ఒక మంచి ఇల్లు తీసుకొని సెటిల్ అవదామని శ్రీధర్ అంటుంటే.. ఇంకొక మాట మాట్లాడితే మర్యాద గా ఉండదని శ్రీధర్ కి వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అక్కడ ఈ కేసు తీసుకుంది భగవాన్ దాస్.. సీనియర్ లాయర్.. తనకి ఎదురు ఎవరు వెళ్ళలేరు. ఇక దీపకి కఠిన కారాగార శిక్ష పడుతుందని శ్రీధర్ హెచ్చరించి వెళ్తాడు.

ఆ తర్వాత కార్తీక్ ఒక లాయర్ దగ్గరికి వెళ్తాడు. తన పేరు కళ్యాణ్ ప్రసాద్.. న్యాయం కోసం ఎంతగా అయిన పోరాడుతాడు అతని దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. ఏ పరిస్థితిలో దీపని పెళ్లి చేసుకున్నాడో ఆ తర్వాత జరిగిన సిచువేషన్ అంతా కార్తీక్ చెప్తాడు. సరే ఒకసారి మీ భార్య దీపని కలవాలని లాయర్ అంటాడు. నేను తన గురించి మొత్తం చెప్పాను కదా అని కార్తీక్ అంటాడు. అసలు ఏం జరిగిందని తను కూడా చెప్పాలి కదా అని లాయర్ అంటాడు.

మరొకవైపు జ్యోత్స్న భగవాన్ దాస్ దగ్గరికి వెళ్లి తన కేసు గురించి చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ప్రసాద్ ని కార్తీక్ తీసుకొని దీప దగ్గరికి వెళ్తాడు. దీప జరిగింది మొత్తం చెప్తుంది. ఈ కేసుకి ఆధారాలు చాలా ఇంపార్టెంట్ అని దీపతో లాయర్ మాట్లాడతాడు‌. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. లాయర్ ఉండడం చూసి బయట ఉంటుంది. లాయర్ వెళ్లిపోతుంటే జ్యోత్స్న లాయర్ దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకుంటుంది. మీరు ఈ కేసు ఎందుకు తీసుకున్నారు.. దీప తప్పు చేసిందని జ్యోత్స్న అంటుంది. నువ్వు నమ్మితే సరిపోదు కోర్ట్ కూడా నమ్మాలి న్యాయమే గెలుస్తుందని జ్యోత్స్నతో కళ్యాణ్ ప్రసాద్ అంటాడు‌. ఆ తర్వాత దీప, కార్తీక్ ల దగ్గరికి జ్యోత్స్న వెళ్లి వాళ్ళను రెచ్చగొట్టేల మాట్లాడుతుంది. దీప కోపంతో సెల్ నుండే జ్యోత్స్న గొంతు పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.