English | Telugu

Karthika Deepam2 : ఆ రిపోర్ట్స్ లో ఏం ఉందంటే.. కార్తీక్ షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -218 లో.... దాస్ ని దీప అసలైన వారసురాలన్న నిజం ఎవరికి చెప్పకని కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చెయ్యడంతో.. నా నోటితో నిజం చెప్పను కానీ అలాగని దీపకి అన్యాయం చెయ్యనని దాస్ అంటాడు. ఏం చేస్తావని జ్యోత్స్న అడిగేలోపే దాస్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నువ్వు న్యాయం చేసేలోపు నేనే ఆ దీపని పైకి పంపిస్తానని జ్యోత్స్న అనుకుంటుంది.

ఆ తర్వాత శౌర్య స్కూల్ వెళ్ళనంటుంటే అప్పుడే కార్తీక్ వచ్చి శౌర్య పైకి కోప్పడతాడు. స్కూల్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని కార్తీక్ అంటాడు. అప్పుడే డాక్టర్ ఫోన్ చేసి శౌర్య రిపోర్ట్స్ వచ్చాయని అంటాడు. శౌర్యని తీసుకొని హాస్పిటల్ రా అని డాక్టర్ అంటాడు. దాంతో సరే శౌర్యా ఈ రోజు స్కూల్ కి వెళ్ళకు హాస్పిటల్ కి వెళదాం.. నాకు తలనొప్పిగా ఉంది. దాంతో శౌర్యకి చెకప్ చేయించి తీసుకొని వస్తానని కార్తీక్ అనగానే నేను కూడా వస్తానని దీప అంటుంది. దీపని ఎలాగైనా ఆపాలని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. ఒకవేళ అసలైన వారసురాలు వస్తే ఏం చేస్తావని పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. అది రాదని పారిజాతం అంటుంది.

వచ్చింది కానీ నీకు చెప్పిన వేస్ట్ అని‌‌ జ్యోత్స్న అనుకొని.. దీప అసలైన వారసురాలన్న విషయం చెప్పదు. అప్పుడే శివన్నారాయణ వచ్చి ఎందుకు రాత్రి పడుకోనట్టు ఉన్నావని జ్యోత్స్నని అడుగగా.. బావ వర్క్ పై దృష్టి పెట్టట్లేదని అంటుంది. ఒకసారి చెప్పి చూడు ఆ తర్వాత నేను చూసుకుంటానని శివన్నారాయణ అంటాడు. మరొకవైపు దీప చూడకుండా శౌర్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటాడు. కానీ దీప ఆల్రెడీ కార్ లో వచ్చి కూర్చొని ఉంటుంది. ఎలా మ్యానేజ్ చెయ్యాలని కార్తీక్ టెన్షన్ పడతాడు. కార్తీక్ హాస్పిటల్ కి వస్తాడు. వెనకాలే జ్యోత్స్న కూడా వస్తుంది. డాక్టర్ దగ్గర కి వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండమని దీపతో అంటాడు. డాక్టర్ దగ్గరికి కార్తీక్ వెళ్లి శౌర్య వాళ్ళ అమ్మ కూడా వచ్చిందని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.