English | Telugu

Karthika Deepam2 : ఎమోషనల్ అయిన సుమిత్ర.. రిసెప్షన్ కి దీప ఒప్పుకుంటుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -195 లో.....కార్తీక్ నా భర్త.. వాళ్ళది అసలు పెళ్లే కాదని జ్యోత్స్న అంటుంది. ఎలాగైనా నా బావని నా సొంతం చేసుకుంటానని సుమిత్రకి చెప్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ప్లీజ్ అత్తయ్య నా కూతురిని వదిలెయ్యండి అని పారిజాతంతో చెప్తుంది సుమిత్ర. పెద్దవాళ్ళుగా చేసేది తప్పని చెప్పాలి కదా అంటుంది. మీరు చేసింది ఏంటని పారిజాతం అంటుంది. ఆ తర్వాత దీప లోపలికి వెళ్తుంది. దీప ఎందుకు రిసెప్షన్ వద్దని అంటుందో నాకు అర్థమైందని అనసూయతో కాంచన అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు.

అవి ఏంటని కాంచన అనగానే.. ట్యాబ్లెట్ మరియు వాళ్ళ రిసెప్షన్ కి శౌర్య వేసుకుంటందని బట్టలు తీసుకొని వచ్చానని కార్తీక్ అంటాడు. మరి దీపకి అని కాంచన అనగానే.. అది మీరు చూసుకుంటారు కదా అని కార్తీక్ అంటాడు. డాక్టర్ ఏమన్నాడని కాంచన అనగానే శౌర్యని హ్యాపీగా చూసుకోమని చెప్పాడు. ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలని కార్తీక్ అంటాడు. ఇంతకీ దీప ఎందుకు రిసెప్షన్ వద్దని అంటుందని కార్తీక్ అడుగుతాడు. అందరు మీ నాన్న ఎక్కడ అని అడుగుతారు కదా అని కాంచన అంటుంది. అవును అందుకే వద్దని అంటున్నానని దీప అప్పుడే వచ్చి అంటుంది. ఇక అప్పుడే స్వప్న, కాశీ లు వచ్చి డాడ్ ని మేమ్ పిలుస్తామని.. ఎలాగైనా రిసెప్షన్ జరగాలని అంటారు. దంతో దీప కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత స్వప్న, కాశీ లు శ్రీధర్ వాళ్ళ ఇంటికి బయలుదేర్తారు. మనం ఇక్కడ దీపని ఒప్పించాలని అనసూయ, కాంచన ఇద్దరు అనుకుంటారు.

ఆ తర్వాత కాశీ, స్వప్న కలిసి శ్రీధర్ ఇంటికి వెళ్తారు. లోపలికి రావద్దని అంటాడు. కానీ కావేరి లోపలికి పిలుస్తుంది. అన్నయ్య, వదినలకి రిసెప్షన్ చేస్తున్నాం రండీ అని అంటుంది. రానని శ్రీధర్ అంటాడు. మమ్మీ ఎలాగైనా డాడ్ ని తీసుకొని రా అనగానే నేను తీసుకొని వస్తానని కావేరి అంటుంది. ఆ తర్వాత కాంచన, సుమిత్ర లు ఫోన్ మాట్లాడుకుంటారు. నువ్వు కూడా కార్తీక్, దీపల పెళ్లిని తప్పు పడుతున్నావా అని అనగానే.. వాళ్ళని కాదు నిన్ను తప్పు పడుతున్నాను. నువ్వు మీ అన్నయ్య దగ్గర మాట తీసుకున్నావ్.. జ్యోత్స్న ఇంటికి కోడలిని చేసుకుంటానని చిన్నప్పటి అనుకున్నారు. అది ఇప్పుడు కార్తీక్ ని మర్చిపోలేకపోతుందని కాంచనకి సమిత్ర చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.