English | Telugu

Karthika Deepam2 : కాశీకి రాఖీ కట్టిన దీప..నిజం తెలుసుకొని షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -136 లో.....పారిజాతం దాస్ ని కలుస్తుంది. నేను చేసిన పనివల్ల మీ జీవితం ఇలా అయిందని పారిజాతం అనగానే.. అంత పెద్ద తప్పు ఏం చేసావని దాస్ అడుగుతాడు. చేశాను కానీ నీలా.. నీ కొడుకు, నా మనవడు అవ్వకూడదు.. వాడికి ఆ కుటుంబాన్ని దగ్గర చెయ్యాలని పారిజాతం అంటుంది. రేపు రాఖి పండుగ కదా కాశీని ఇంటికి తీసుకొని రా వాడితో జ్యోత్స్న చేత రాఖి కట్టిస్తానని పారిజాతం అంటుంది. అయిన వాళ్ళు రానిస్తారా.. నన్ను తిట్టారు.. కానీ వాడిని తిడితే భరించలేనని దాస్ అనగానే.. నువ్వు తీసుకొని రా నేను చూసుకుంటానని పారిజాతం అంటుంది.

ఆ తర్వాత నేను నేనొక విషయం చెప్పాలని దాస్ అంటాడు. ఏంటని పారిజాతం అడుగగా.. రేపు చెప్తానని దాస్ అంటాడు. ఏంటని పారిజాతం అడుగుతుంటే.. ఒక పుట్టుక.. ఒక చావు.. ఒక బతుకు అనుకుంటూ దాస్ వెళ్ళిపోతాడు. మరొకవైపు అనసూయ వంట చేస్తుంది. ఏంటి ఈ డబ్బా అని దీపని అనసూయ అడుగుతుంది. అది వేరే అందులో డబ్బులు వేస్తున్నాను.. కార్తీక్ బాబుకి ఇవ్వాలిసిన డబ్బులు.. అందులో జమ చేస్తున్నానని దీప అనగానే.. నీ పెంపకానికి నా పెంపకానికి ఎంత తేడా ఉందిరా తమ్ముడు అంటూ వాళ్ళ తమ్ముడిని గుర్తుచేసుకుంటుంది అనసూయ. ఆ తర్వాత శౌర్య గెంతుతుంటే.. నువ్వు అలా చెయ్యకూడదని అనసూయ అంటుంది. శౌర్య ఎందుకు అలా ఆడకూడదని దీప అడుగగా.. అనసూయ ఏదో ఒకటి కవర్ చేస్తుంది. మరొకవైపు పారిజాతం శివన్నారాయ దగ్గరికి వచ్చి.. తనని మాటలతో కూల్ చేసి.. రేపు దాస్ కొడుకు కాశీ ఇక్కడికి వస్తాడు. జ్యోత్స్న కాశీకి రాఖీ కడుతుంది. కాశీని కాపాడలేదన్న కోపంలో కార్తీక్ ఉన్నాడు కదా.. ఇలా చేస్తే జ్యోత్స్న పై కోపం పోతుందని పారిజాతం అంటుంది. అయిన శివన్నారాయణ‌ ఒప్పుకోకపోగ.. అతడిని బలవంతంగా ఒప్పిస్తుంది.

మరొకవైపు దీప, అనసూయలు శౌర్యని సుమిత్ర దగ్గరికి వెళ్ళమని చెప్పి.. ఊరు బయలుదేర్తుంటే అప్పుడే కాశీ, దాస్ లు వస్తారు. మీరు ఇక్కడికి వచ్చారని అడుగగా.. మా అమ్మ పారిజాతం రమ్మందని దాస్ చెప్తాడు. అది విని దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత మీరు నన్ను కాపాడారు అక్క.. మీరు నాకు రాఖి కట్టండి అని దీపతో కాశీ రాఖీ కట్టించుకుంటాడు. ఇంకొక రాఖీ కోసం కాశీ, దేవ మళ్ళీ బయటకు వెళ్తారు. కార్తీక్ బాబు పెద్ద సమస్యలో పడ్డారని దీప ఆలోచిస్తుంటే.. ఏం ఆలోచిస్తున్నావని అనసూయ అనగానే.. వెళ్దామని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.