English | Telugu

Karthika Deepam2: జ్యోత్స్న మాటలకి దిగొచ్చిన శివన్నారాయణ.. కాంచన దగ్గరికి మొత్తం వచ్చేసారుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-311లో.. జ్యో అడిగిన ప్రశ్నకు శివనారాయణ ఆవేశం రెట్టింపు అయిపోతుంది. దాంతో పొలమారి అతడికి తీవ్రమైన దగ్గు వస్తుంది. వెంటనే దశరథ్, సుమిత్ర కంగారుపడి.. నాన్నా.. మావయ్యగారు అని అతడ్ని పట్టుకుంటారు. జ్యోత్స్న వెంటనే పరుగున వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చి కొంచెం తాగు అంటుంది. వాటర్ బాటిల్‌ని తోసేస్తూ.. వాటర్ తాగకపోతే దగ్గు ఆగుతుంది. కానీ నిన్ను ఆపకపోతే వాడు ఆగేలా లేడు అని తిడుతూనే ఉంటాడు. కాసేపటికి అతడి దగ్గు ఆగుతుంది. లేదు తాతా.. నేను ఏ తప్పు చేయలేదు.. రేపు నిశ్చితార్థంలో అత్త ఫ్యామిలీ లేకపోతే జనం ఏం అనుకుంటారు? శివనారాయణ గారు కూతుర్ని తరిమేశారు.. ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదట అని చెప్పుకుంటారు. అప్పుడు పోయేది ఎవరి పరువు.. వాళ్లదా.. మనదా.. అలా అని నేరుగా అత్తను పిలిస్తే వస్తుందా అంటే.. రాదు. అత్త రావాలని మమ్మీ డాడీ కోరుకుంటున్నారు. ఆల్రెడీ నిన్ను అడిగారు.. కానీ నువ్వు వద్దు అన్నావని జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. మరి అప్పుడైనా అర్థం కదా వాళ్లు రావడం నాకు ఇష్టం లేదని శివన్నారాయణ అంటాడు. చెల్లెలికి మనం తప్ప ఇంకెవరున్నారు నాన్నా అని దశరథ్ అంటాడు. మనకు ఏమైనా వంద మంది ఉన్నారా. .అంతా కలిస్తే ఒక పది మంది కూడా లేరు.. ఉన్నవాళ్లనైనా కూతురికి ఫంక్షన్‌కి పిలుచుకోవాలని తల్లిగా నేను ఆశపడతాను కదా మావయ్యగారని సుమిత్ర అంటుంది. ఇవన్నీ కాదు తాతా.. నా నిశ్చితార్థానికి అత్త బావ రావాలని కోరుకుంటున్నాను.. నా కోరిక నువ్వు తీరుస్తావా లేదా అంటూ జ్యోత్స్న మాట్లాడుతుంటే తాత కాస్త శాంతించి వింటూ ఉంటాడు.

నువ్వు వెళ్లి పిలుస్తావా.. డాడీ వెళ్లి పిలుస్తారా ఇవన్నీ నాకు తెలియదు.. నేను మీ మాట విని.. బావని వదులుకుని మీరు చూసిన సంబంధం చేసుకోవడానికి సిద్ధమయ్యాను.. అలాంటి మీకోసం నేను నా బావనే నేను వదులుకున్నప్పుడు నా కోరిక తీర్చడానికి నువ్వు నీ పంతాన్ని వదలుకోలేవా? కలిసిపొమ్మనడం లేదు. పిలవమంటున్నాను.. అత్తా బావా అధికారికంగా వస్తే దీప క్యాటరింగ్‌కి వంట మనిషిలా వస్తుంది.. పైగా బావ రన్ చేస్తున్నా రెస్టారెంట్‌ నుంచి ఫుడ్ తెప్పించుకుంటే మనం అంతా కలిసిపోయామని.. మన మధ్య ఏ గొడవలు లేవు అని నాకు కాబోయే అత్తమామలు అనుకుంటారు కదా.. అంటూ జ్యో చెబుతూ ఉంటుంది. శివనారాయణ శాంతంగా వింటుంటే.. జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. తప్పదు తాత నువ్వు నా కోరిక తీర్చాల్సిందే.. నా నిశ్చితార్థానికి దీప క్యాటరింగ్ చెయ్యాలి. అత్తా బావా అక్షింతలు వేయడానికి రావాలి . ఏమంటావ్ తాతా అని జ్యోత్స్న అంటుంది. వెంటనే శివనారాయణ మాట్లాడుకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మావయ్యగారు ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారేంటని సుమిత్ర అనగా.. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి మమ్మీ.. తాత మౌనమే నేను కోరుకున్న సమాధానం.. క్యాటరింగ్ వద్దని అనలేదు కదా? వాళ్లకు కాల్ చేసి ఓకే అని చెబుతానని జ్యోత్స్న అంటుంది.

మరి వదినను కార్తీక్‌ని పిలిచే విషయమంటూ సుమిత్ర అనుమానంగా అంటుంటే.. ఇప్పుడేగా మమ్మీ తాతను వరం అడిగాను.. కాస్త ఆలోచించుకోనీ మమ్మీ.. రిజల్ట్ పాజిటివ్‌గానే వస్తుందని జ్యోత్స్న అంటుంది. మరోవైపు కార్తీక్, దీపలు క్యాటరింగ్ విషయంలో జరిగిన మోసం గురించి పారిజాతం చేసిన పని గురించి కాంచనకు చెప్పడంతో అంటే ఆ జ్యోత్స్న ఇంకా మారలేదని మాట.. ఏంట్రీ అది.. పళ్లు రాలగొట్టాల్సిందిరా దానికి అని రెచ్చిపోతూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న ఫోన్ చేయడంతో కార్తీక్ లిఫ్ట్ చేసి స్పీకర్‌లో పెడతాడు. మీరే ఈ క్యాటరింగ్ చేస్తున్నారు. ముందు అనుకున్నట్లే మీరే సప్లై చెయ్యాలి.. ఇందులో ఏమైనా మార్పు ఉందా అని జ్యోత్స్న అంటుంది. మేము క్యాటరింగ్ అని కార్తీక్ మాట పూర్తి కాకుండానే దీప ఫోన్ లాక్కుంటుంది.

మేము ఈ క్యాటరింగ్ చేస్తున్నాం.. ఆర్డర్ తీసుకున్నాక మీ వల్ల ఆగాలి కానీ మా వల్ల ఎప్పుడూ ఆగదు, ఉంటానని దీప కట్ చేసేస్తుంది. అలా ఎందుకు చెప్పావ్ దీపా అని కాంచన అనగా‌.. అమ్మా దీని వల్ల మనకు ఏ నష్టం లేదు.. పైగా మన రెస్టారెంట్‌కి ఫుల్ పబ్లిసిటీ అవుతుంది.. ఎందుకంటే జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవో గారి నిశ్చితార్థానికి సత్యరాజ్ రెస్టారెంట్‌ నుంచి క్యాటరింగ్ తెప్పించుకున్నారంటే మనకే లాభం కదా.. పైగా అంతమంది ముందు మనల్ని అవమానిస్తే తాతకే అవమానం.. అలా జరగదు భయపడకు అని కార్తీక్ అనేసి వెళ్లిపోతాడు. కుటుంబాలు కలవడానికి ఇదే మార్గం అమ్మా.. వద్దనకండి అని కాంచనతో దీప చెప్తుంది. ఇక మరుసటి రోజు కార్తీక్ రెడీ అయ్యి రెస్టారెంట్‌కి వెళ్లడానికి సిద్ధమవుతుంటే.. కాంచన మాత్రం పదేపదే గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. దశరథ్, సుమిత్రలు వస్తారేమోనన్న ఆశతో.. మొత్తానికీ వాళ్లొస్తారు. రేయ్ కార్తీక్.. మా అన్నయ్య నాకోసం వచ్చాడురా.. మా వదిన కూడా వచ్చిందని కాంచన సంబరపడుతుంటే.. దశరథ్, సుమిత్రల పక్కకు వచ్చి నిలబడి కేవలం అన్నయ్యే కాదు.. స్వయంగా మీ నాన్న కూడా వచ్చారంటూ పారిజాతం నవ్వుతూ పక్కకు తప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.