English | Telugu

Karthika Deepam 2 : గతం చెప్పేసిన కార్తీక్.. ఆ నిజాన్ని దాస్ చెప్పగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -216 లో......దీపలో ఉందేంటి నాలో లేదేంటని కార్తీక్ తో జ్యోత్స్న అనగానే.. గుణం, మంచితనం అని దీప గురించి గొప్పగా మాట్లాడతాడు. నీకోసం నా ప్రాణం అయిన ఇస్తాను బావ అని జ్యోత్స్న అనగానే.. నువ్వు ఇస్తావా.. చిన్నప్పుడు నేను కొలను లో పడిపోతే నువ్వు వదిలేసి వెళ్ళావ్ కానీ ఒక అమ్మాయి వచ్చి ప్రాణం కాపాడిందని కార్తీక్ చెప్తాడు.

ఆ దీపని ఇక అడ్డు తొలిగించే పనిలో ఉంటానని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు అనసూయ కుబేర్ ఫోటో చూస్తూ.. నీకు దీప దొరికిందని దాస్ కి చెప్పాను.. ఎవరికి చెప్పొద్దూ అన్నావు కానీ చెప్పాను తమ్ముడు అని అనసూయ ఏడుస్తుంది. ఈ విషయం దీపకి తెలియొద్దని అనసూయ అనుకుంటుంది. ఏ విషయమంటూ కార్తీక్ అంటాడు. అప్పుడే కాంచన, దీప ఇద్దరు వస్తారు. మీకు అందరికి ఒక విషయం చెప్పాలని కార్తీక్ అంటాడు. దీప వాళ్ళ నాన్న చనిపోయింది నా వాళ్లే అని కార్తీక్ అనగానే అందరు షాక్ అవుతారు. అవును నేను లండన్ వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలని వెళ్లినప్పుడు మా కార్ తాకి పడొపోయాడు. దీప దీప అన్నాడని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత కార్తీక్ జరిగింది మొత్తం చెప్తాడు. దీప అసలు నిజం తెలుసుకుంది. ఎలాగైనా దీపకి సాయం చెయ్యాలనుకున్నానని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత దీప అమ్మ నాన్న బతికే ఉన్నారని అనసూయ అంటుంది. ఏంటని దీప అనగానే అనసూయ డైవర్ట్ చేస్తుంది. ఎక్కడో ఉండి ఉంటారని ఉదేశ్యలో అన్నానని అనసూయ అనుకుంటుంది. మరొకవైపు జ్యోత్స్న ఇంటికి కోపంగా వెళ్తుంది.. అప్పుడే దాస్ పారిజాతం ఇంటికి వెళ్తాడు. ఎందుకు వచ్చావని శివన్నారయణ కోప్పడతాడు. దశరథ్ అన్న సుమిత్ర వదిన కోసం అని దాస్ అంటాడు. వాళ్లు లేరు అనగానే దాస్ వెళ్లిపోతాడు. వీడు ఎందుకు వచ్చాడని పారిజాతం, జ్యోత్స్న అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.