English | Telugu

Karthika Deepam 2: దీప కండిషన్ అదే.. ఆ పూజ జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -186 లో.... దీపని తీసుకొని కార్తీక్ గదిలోకి వస్తుంది శౌర్య. నాతో ఏమైనా మాట్లాడాలా అని కార్తీక్ అంటాడు. మాట్లాడడానికి కాదు నాన్న ఇక్కడే పడుకోవడానికి అని శౌర్య అంటుంది. ఇబ్బందిగానే దీప పడుకుంటుంది. వాళ్ళ ఇద్దరిలో మధ్యలో శౌర్య పడుకుంటుంది. నాన్న నాకు కథ చెప్పు అనగానే.. దీప స్టోరీనీ చెప్తుంటాడు కార్తీక్. శౌర్య పడుకున్నాక దీప గదిలో నుండి వెళ్ళిపోతుంది.

దీపని చూసిన అనసూయ.. శౌర్య కోసం, నా కోసం.. నువ్వు అక్కడికి వెళ్ళావ్.. ఇష్టం లేదు కదా అని అంటుంది. కాంచన అమ్మ మీ ఇద్దరి చేత సత్యనారాయణ వ్రతం చేయించాలనుకుంటుందని అనసూయ అనగానే.. వద్దని దీప చెప్పి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు దీప గుడికి వెళ్తుంది. అక్కడ కూర్చొని బాధపడుతుంది. మరొకవైపు సుమిత్ర అదే గుడికి వెళ్తుంది. జ్యోత్స్న పేరున అర్చన చేయిస్తుంది. సుమిత్రకి ఒక పండుని ప్రసాదంలాగా ఇస్తాడు పూజారి. అది పట్టుకొని వెళ్తుంటే కిందపడిపోయి దీప దగ్గరికి వస్తుంది. దీపని సుమిత్ర చూస్తుంది. సుమిత్ర దీపతో బానే మాట్లాడుతుంది. జరిగింది.. జరిగిపోయింది దాన్ని ఎవరు మార్చలేరని అంటుంది. నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్లనిపిస్తుంది. కార్తీక్ ని భర్త గా ఒప్పుకోలేదా అని అడుగుతుంది. ఇష్టం లేకుండా జరిగింది నా కూతురికి నాన్న అవ్వాలని అలా చేసాడు కానీ నాకు భర్త అవ్వాలని కాదని దీప అంటుంది.

పెళ్లి అయింది.. దీన్ని ఎవరు మార్చలేరు.. ఇది నా కూతురు కోసం పూజారి ఇచ్చిన ప్రసాదం.. ఇది ఇప్పుడు నీకు అవసరం అయ్యేలా ఉందని సుమిత్ర తనకి ఇచ్చి వెళ్తుంది. పూజ ఎలా ఆపాలి.. వాళ్ళంతట వాళ్లే ఆపేలా చెయ్యాలని దీప అనుకుంటుంది. తరువాయి భాగంలో పూజ తర్వాత మమ్మల్ని ఇద్దరు ఆశీర్వాదించాలి కానీ మీరు ఒక్కరే ఉన్నారు.. శ్రీధర్ గారిని కూడా రమ్మని చెప్పాలి.. అప్పుడే ఈ పూజ జరుగుతుందని దీప కండిషన్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.