English | Telugu

'హైపర్ ఆది'పై దాడి.. విరుచుకుపడిన జబర్దస్త్ కమెడియన్!

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్కిట్స్ లో తన పంచ్ డైలాగ్స్ తో ఎంతలా నవ్విస్తాడో, అదే స్థాయిలో వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటాడు. గతంలో తన స్కిట్స్ లో పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేయడంతో పాటు.. అనాధలపై దారుణ వ్యాఖ్యలు చేయడం వంటి వాటితో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణుని ఇమిటేట్ చేసి మరోసారి వివాదానికి తెరలేపాడు.

హైపర్ ఆది రీసెంట్ గా చేసిన స్కిట్ లో మంచు విష్ణుని టార్గెట్ చేశాడు. మా ఎన్నికల సమయంలో సీనియర్ యాక్టర్ నరేష్ తో విష్ణు అన్న 'లెట్ దెమ్ నో అంకుల్' అనే మాటతో పాటు, విష్ణు బాడీ ల్యాంగ్వేజ్ ను తన స్కిట్ లో ఇమిటేట్ చేశాడు ఆది. విష్ణు పేరు ప్రస్తావించక పోయినా ఇది విష్ణుని ఉద్దేశించి చేసినది అనే ఆడియన్స్ కి అర్థమైంది. ఈ క్రమంలో మంచు అభిమానులు ఆదిని టార్గెట్ చేశారు. అంతేకాదు, ఆది దొరికితే చితకబాదడం కోసం విష్ణు అభిమానులు వెతుకున్నారని, భయంతో ఆది అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఆదిపై దాడి జరిగిందని కూడా వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఈ వార్తలపై స్పందించిన ఆది.. ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

దాడి వార్తలపై జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా స్పందించాడు. తన గురించి ఎవరో వెతుకుతున్నారని, తనపై దాడి జరిగిందని ఇలా రకరకాలుగా కొన్ని వెబ్ సైట్స్ ఫేక్ న్యూస్ రాస్తున్నాయని మండిపడ్డాడు. డబ్బులు కోసం ఇలాంటి ఫేక్ న్యూస్ రాయకండిరా, డబ్బులు కావాలంటే నన్ను అడగండి నేనిస్తా అంటూ ఫైర్ అయ్యాడు. అసలు మీ లాంటి వాళ్లని శాంతి స్వరూప్ కి పట్టించాలి అంటూ హైపర్ ఆది తనదైన శైలిలో స్పందించాడు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.