English | Telugu

Illu illalu pillalu : ధీరజ్ పై కోప్పడిన రామరాజు.. జీతం డబ్బుల కోసం రచ్చ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-155 లో... చందు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అబ్బా వచ్చారా.. ఉదయం నుండి బోర్ కొడుతుందని శ్రీవల్లి అనగానే.. ఎందుకు ఇంట్లో అందరు ఉన్నారుగా అని చందు అంటాడు. ఉంటే మీరు లేరు కదా అని శ్రీవల్లి అంటుంది. చందు తన జీతం డబ్బు శ్రీవల్లికి ఇచ్చి.. ఇది రేపు నాన్నకి ఇవ్వాలని అంటాడు. అంత డబ్బు శ్రీవల్లి చూసి షాక్ అవుతుంది. ఇంత డబ్బు మా ఆయన ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఎలా అందరు మా అయన సంపాదనతో బ్రతుకుతున్నారన్నమాట అని శ్రీవల్లి అనుకుంటుంది.

మరోవైపు నర్మద అన్న మాటలకి సాగర్ బాధపడతాడు. సాగర్ దగ్గరికి ధీరజ్ వచ్చి ఏంట్రా ఇలా ఉన్నావని అడుగుతాడు. జరిగింది చెప్పి సాగర్ బాధపడతాడు. నాన్న మిల్ లో వర్క్ ఉందని అలా చేసాడు అంతే కానీ నీ భార్యతో బయటకు వెళ్లొద్దని కాదని ధీరజ్ చెప్తాడు.

మరుసటిరోజు రామరాజుకి వేదవతి టీ ఇస్తుంది. ముగ్గురు కోడళ్ళు చాలా బాగా కలిసిపోయారంటూ మురిసిపోతు రామరాజుకి చెప్తుంది. ధీరజ్ తన నెల శాలరీ రామరాజుకి ఇవ్వాలనుకుంటాడు. మరొకవైపు చందు తన శాలరీ రామరాజుకి ఇవ్వడానికి వస్తాడు. నాకు హైదరాబాద్ లో ట్రైనింగ్ ఉందని మీ నాన్న గారికి చెప్పమని సాగర్ తో నర్మద అంటుంది. సాగర్ రామరాజుకి చెప్పడానికి వస్తాడు. అప్పుడే చందు శాలరీ ఇస్తాడు.

ఆ తర్వాత ధీరజ్ డబ్బు ఇస్తుంటే నువ్వు ఎందుకు ఇస్తున్నావని వేదవతి అంటుంది. అంటే నాకూ నా భార్య కి ఇంట్లో ఉండడానికి చోటు ఇంకా భోజనం పెడుతున్నారు కదా అని ధీరజ్ అంటాడు‌. దాంతో రామరాజుకి కోపం వస్తుంది.

ఇద్దరు మనుషుల తిండికి ఒక ఆరు వేలు సరిపోతాయా అని వేదవతిని రామరాజు అడుగుతాడు. వేదవతి చెప్పకపోవడంతో శ్రీవల్లిని రామరాజు అడుగుతాడు. ఎనిమిది నుండి పది వేలు అవుతాయని చెప్తుంది. మరి నువ్వు ఏ లెక్కన ఇస్తున్నావ్.. ఉద్యోగం చేస్తున్నానని పొగరు కదా అని ధీరజ్ పై కోప్పడతాడు రామరాజు.

తరువాయి భాగంలో ఇంట్లో అందరికంటే నా భర్త ఎక్కువ సంపాదిస్తున్నాడని శ్రీవల్లి అంటుంది. మా ఆయనకు జీతం ఇస్తే మీ ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.