English | Telugu

అప్పుడేమో అమ్మలాంటిదన్నాడు.. ఇప్పుడేమో అంతా తూచ్ అంటున్నాడు!

ఆర్పీ జబర్దస్త్ షోలో మంచి పేరు తెచ్చుకున్న ఒక కమెడియన్. ఇప్పుడు సోషల్ మీడియాలో జబర్దస్త్ గురించి, మల్లెమాల గురించి ఆర్పీ చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. నెల్లూరు యాసలో మాట్లాడుతూ రెండు కాళ్ళు గాల్లో లేపి కొడుతూ మంచిగా ఫేమస్ ఐన ఆర్పీ ఇమేజ్ ఇప్పుడు డామేజ్ అయ్యింది. జబర్దస్త్ షో తమ స్కిట్స్ వల్లనే ఫేమస్ అయ్యిందని, మల్లెమాల ఒక పేరు మాత్రమే అని, ఇదంతా వ్యాపారం అని ఇలా రకరకాల కామెంట్స్ తో ఫైర్ ఐపోతున్న ఆర్పీకి బ్రేక్ వేశారు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్. సుధీర్, శీను జబర్దస్త్ నుంచి వెళ్లిపోయేసరికి ఇప్పుడు ఆటో రాంప్రసాద్ కి, హైపర్ ఆదికి మధ్య మంచి రేపో పెరిగినట్టు కనిపిస్తోంది. ఇద్దరూ కలిసే ఏ పనైనా చేస్తున్నారు. ఇక వీళ్ళు రంగంలోకి దిగి ఆర్పీ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చి పడేసారు.

ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆది మాట్లాడుతూ "శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక నిర్మాత, ఆయన మాజీ సీఎంకి అల్లుడు కూడా. అలాంటి ఒక వ్యక్తిని ఆర్పీ ఏకవచనంతో మాట్లాడడం కరెక్ట్ కాదు. జబర్దస్త్ కి లైఫ్ ఇచ్చాం అని, సుధీర్ రష్మీ స్కిట్స్ వల్ల జబర్దస్త్ కి రేటింగ్ వచ్చిందని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు" అన్నాడు ఆది. "రేటింగ్ అనేది కంటెంట్ వల్ల వస్తుంది" అని చెప్పుకొచ్చాడు ఆది. తర్వాత రాంప్రసాద్ తన సెల్ లో ఒక వీడియో బైట్ ప్లే చేసి చూపించాడు.

"గతంలో ఆర్పీ ఒక ఎపిసోడ్ లో జబర్దస్త్ తమకి అమ్మలాంటిది అని చెప్పి ఇప్పుడు జబర్దస్త్ ని వదిలేసి వేరే ఛానల్ కి వెళ్లి అంతా తూచ్ అమ్మ కాదు ఏమీ కాదు అంటూ అబద్దాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్?" అని ప్రశ్నించాడు. ఇక ఆది, రాంప్రసాద్ కౌంటర్స్ తో ఆర్పీ ఇమేజ్ ఒక్కసారిగా డామేజ్ అయ్యింది. ఐతే ఇటీవల గమనిస్తే జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు. సుధీర్, అనసూయ, శీను.. ఇలా వెళ్లిపోతుండేసరికి దీనికి ఉన్న రేటింగ్ తగ్గిపోయింది. ఐనా సరే మళ్ళీ ఈ షోకి పూర్వ వైభవం తీసుకురావడానికి మల్లెమాల యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.