English | Telugu

Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి విడాకుల గురించి నిజం తెలుస్తుందా.. సవతి తల్లి మరో ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -270 లో.. శ్రీలతకి నందిని ఫోన్ చేసి.. మీరు ఇలా ఏం ప్లాన్ చెయ్యకుండా ఉంటే ఎలా? నా సీతా నాకు దూరం అవుతున్నాడనిపిస్తుంది.. రామలక్ష్మి వాలకం చూస్తుంటే ఏదో ప్లాన్ లో ఉన్నట్టు ఉంది అందుకే నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రామలక్ష్మి ని లేకుండా చేస్తానని నందిని అంటుంది. శ్రీవల్లి ఫోన్ లాక్కొని నీకంటే ఆస్తులున్నాయ్. మాకు బావ గారి ఆస్తులు తప్ప ఏం లేవు. ఇప్పుడు ఆస్తులన్నీ రామలక్ష్మి పేరు మీదే ఉన్నాయ్ తనని చంపేస్తే ఆస్తులన్నీ ఎలా అని శ్రీవల్లి అంటుంది.

శ్రీలత ఫోన్ తీసుకొని.. శ్రీవల్లి చెప్పింది కరెక్టే.. రామలక్ష్మిపై సీతాకాంత్ కి విరక్తి పుట్టి సీతా నే విడాకులు ఇచ్చేలా చేస్తానని శ్రీలత అంటుంది. దానికి నందిని సరే అంటుంది. మరొక వైపు రామలక్ష్మి మాణిక్యంలు విడాకుల నోటిస్ పంపిన లాయర్ దగ్గరికి వచ్చి మీరు నాకు ఇష్టం లేకుండా ఎందుకు పంపారని రామలక్ష్మి అడుగుతుంది. మీ అత్తయ్య గారు మీకు విడాకులు ఇష్టమే.. మీరు రాలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇలా చేసానని లాయర్ అనగానే.. ఇప్పటికి అయినా అర్ధం అయింది కదా నాకు న్యాయం చెయ్యండి అని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడే మీ అత్త గారిపై కేసు పెడుతానంటాడు వద్దు మళ్ళీ మా ఆయన నన్ను అపార్ధం చేసుకుంటాడు. నేను పంపలేదు అని మా అయనతో చెప్పండి చాలని రామలక్ష్మి అనగానే.. లాయర్ సరే అంటాడు.

మరొకవైపు రాత్రి అయినా సందీప్ వాళ్లు వర్క్ చేస్తుంటే.. సీతాకాంత్ వచ్చి పడుకోండి అంటాడు. రేపు పని త్వరగా అయిపోతుంది అంటాడు. మీకు ఇలా పని చేస్తుంటే ఏం అనిపించడం లేదా అని సీతాకాంత్ అనగానే.. ఆస్తులు లేవనీ నిన్ను వదిలేసి వెళ్ళలేము అన్నయ్య అని సందీప్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ గదిలోకి వెళ్లి.. చూసావా వాళ్ళను ఎలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నావో అని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సందీప్, శ్రీవల్లి లు బిర్యానీ తింటుంటే రామలక్ష్మి వచ్చి చూస్తుంది. వీళ్లేమో ఇలా ఉన్నారు సీతా సార్ వీళ్ళని నమ్ముతున్నాడనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం మాణిక్యాన్ని కలుస్తుంది రామలక్ష్మి. ఇక శంకర్ లాయర్ అల్లుడు ముందు నిజం చెప్తే శ్రీలత అట కట్టియోచ్చని మాణిక్యం అనగానే.. వద్దు నాన్న సీతా సర్ వాళ్ళ అమ్మ గురించి నిజం తెలిస్తే తట్టుకోలేడని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.