English | Telugu

Eto Vellipoyindhi Manasu : అత్తకి వార్నింగ్ ఇచ్చిన కోడలు.. కౌంట్ డౌన్ మొదలైందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -209 లో.....సీతాకాంత్ డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. అప్పుడే శ్రీలత ఇంటికి వస్తుంది. అమ్మ గుడికి వెళ్ళావా అని సీతాకాంత్ అడుగుతాడు. అవును నువ్వు కోలుకుంటే వస్తానని మొక్కుకున్నానని శ్రీలత అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి శ్రీవల్లి హారతి ఇస్తుంది‌. అందరు ఇంట్లోకి వెళ్తారు. మీరు ఎక్కువసేపు నిల్చొని ఉండకండి. రెస్ట్ తీసుకుండి అని లోపలికి పంపిస్తుంది. ఆ తర్వాత ఈ ఎటాక్ కి కారణం మీరే అని నాకు డౌట్ ఉందని శ్రీలతతో రామలక్ష్మి మాట్లాడుతుంది. మీరు ఎంత నిజం దాచాలని చూసిన నిజం దాగదని రామలక్ష్మి అంటుంది.

దొంగతనం, హత్యా ప్రయత్నం ఎవరు చేశారు.. నిజంగానే మా అయన పైన జరిగిందా.. అని నిజం బయటకు తీస్తా ఎవరైనా లక్ష్యంగా పెట్టుకున్నారా నేను తెలుస్తా.. మీ పాత్ర ఉందని తెలిస్తే నరకం చూపిస్తా.. ఇక కౌంట్ డౌన్.. మీరు దొంగప్రేమ నటించినా దొరికిపోతారు. మీ పాపాల చిట్టా బయటపెట్టి బయటకు పంపిస్తానని శ్రీలతకి వార్నింగ్ ఇస్తుంది రామలక్ష్మి. ఆ తర్వాత సీతాకాంత్ నొప్పితో బాధపడుతుంటే అప్పుడే రామలక్ష్మి వచ్చి డ్రెస్సింగ్ చేస్తాను పడుకోమని చెప్తుంది. అప్పుడే నందిని రామలక్ష్మికీ ఫోన్ చేస్తుంది సీతాకాంత్ పిలవడంతో రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడ పెట్టి వస్తుంది. సీతాకాంత్ కీ డ్రెస్సింగ్ చేస్తుంటే చెక్కిలిగింతలు అవుతున్నాయని అంటాడు. మీరు కదలకుండా ఉంటే మీకు ముద్దు ఇస్తానని రామలక్ష్మి అనగానే అవునా సరే అంటూ సీతాకాంత్ డ్రెస్సింగ్ చేయించుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మిని దగ్గరికి తీసుకొని నా ముద్దు ఎక్కడ అని అడుగుతాడు. రామలక్ష్మి తర్వాత ఇస్తానంటూ సరదాగా మాట్లాడుతుంది. అదంతా నందిని ఫోన్ లో వింటూ కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత నందిని మేడమ్ ఎందుకు కాల్ చేశారని నందినికి చేస్తుంది రామలక్ష్మి. సీతాకాంత్ గురించి అడిగి తెలుసుకుందామని చేశా అని తను అంటుంది.

ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలో.. రామలక్ష్మి ఫోటో చింపేస్తుంది‌ నందిని. ఆ తర్వాత తన ఫోటో పక్కనపెట్టి రామలక్ష్మి ఫోటో కాల్చేస్తుంది. అప్పుడే హారిక వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతుంది. నా సీత పక్కన ఎవరిని ఉహించుకోనని నందిని అంటుంది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు.. అయిన నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావంటు హారిక అంటుంది. ఆ తర్వాత ఆఫీస్ గురించి బోర్డు మెంబెర్ సీతాకాంత్ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఆ తర్వాత అతను శ్రీలత, సందీప్ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. అది రామలక్ష్మి చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.