English | Telugu

Eto Vellipoyindhi Manasu : అర్థరాత్రి భార్యాభర్తల ముచ్చట్లు.. అత్త మాస్టర్ ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -191 లో.....రామలక్ష్మి శ్రీలత గదిలోకి వెళ్లి పడుకుంటుంది. దాంతో సీతాకాంత్ లోన్లీగా ఫీల్ అవుతుంటాడు. తన పక్కన రామలక్ష్మి ఉందని ఉహించుకొని తన మనసులో మాటలు చెప్తుంటాడు. అప్పుడే పెద్దాయన వచ్చి.. ఏంటి మనవడా నిద్ర రావడం లేదా అని అడుగుతాడు. తాతయ్య నువ్వా అంటూ సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తాడు. అందుకే నీ మనసులో మాటని నీ భార్యకి చెప్పమని చెప్పానంటూ పెద్దాయన అంటాడు. ఇప్పుడు ఎలా చెప్పాలి.. అమ్మ దూరంగా ఉండమని చెప్పింది కదా అని సీతాకాంత్ అంటాడు.

మీ అమ్మ కలిసి ఉండకూడదు అంది కానీ మాట్లాడుకోకని చెప్పలేదు కదా ఇప్పుడు వెళ్లి నీ మనసులో మాటని రామలక్ష్మికి చెప్పమని పెద్దాయన అనగానే సీతాకాంత్ సరే అంటాడు. మరొకవైపు నందిని ఫోటో షూట్ కోసం సీతాకాంత్ కి సూట్ తీసుకంటుంది. దాన్ని చూస్తూ మురిసిపోతుంటే.. అప్పుడే హారిక వస్తుంది. నువ్వు కొన్నావ్ సరే తను వేసుకుంటాడా అని అడుగుతుంది. తనకి నాపై ప్రేమ ఉంది ఖచ్చితంగా వేసుకుంటాడని నందిని అంటుందిమ. నందిని అలా సీతాకాంత్ పై ప్రేమ చూపించడం చూసి ఆశ్చర్యపడుతుంది. ఆ తర్వాత శ్రీలత పైన పడుకుంటానని లేస్తుండగా అప్పుడే సీతాకాంత్ డోర్ కొడతాడు. దాంతో మళ్ళీ వెంటనే వెళ్లి పడుకుంటుంది. సీతాకాంత్ డోర్ తీసి పేపర్స్ తో రామలక్ష్మిని నిద్ర లేపుతాడు. వీడేంటి ఇలా చేస్తున్నాడని శ్రీలత అనుకుంటుంది. రామలక్ష్మి లేచి సీతాకాంత్ దగ్గరికి వెళ్లి ఏంటని అడుగుతుంది. నీతో మాట్లాడాలి పద అంటూ బయటకు తీసుకొని వస్తాడు.రామలక్ష్మితో తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటాడు. అది తప్ప అన్నీ మాట్లాడతాడు. మరొకవైపు వెళ్లేంటి ఇంకా రావడం లేదని శ్రీవల్లి దగ్గరికి శ్రీలత వెళ్లి.. నిద్రలేపి రామలక్ష్మిని గదిలో నుండి సీతా బయటకు తీసుకొని వచ్చాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వాళ్లు మాత్రం కలవకుండా చూడమని శ్రీలత చెప్తుంది.

ఆ తర్వాత సందీప్ ని శ్రీవల్లి నిద్ర లేపి బలవంతంగా బయటకు తీసుకొని వస్తుంది. సీతాకాంత్ రామలక్ష్మిలు కూర్చొని ఉన్న దగ్గరే శ్రీవల్లి, సందీప్ లు కూర్చొని ఉంటారు. సీతాకాంత్ తన ప్రేమ విషయం చివరికి ధైర్యం చేసి చెప్తుంటే.. అప్పుడే సందీప్ తో శ్రీవల్లి మాట్లాడడం వినిపిస్తుంది. అది విని సీతాకాంత్ చెప్పకుండా ఆగిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.