Read more!

English | Telugu

అందరికీ షాక్ ఇచ్చిన దేవయాని.. కొత్త ప్లాన్ వేసిందా?

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -711 లో.. ధరణి దగ్గరికి రిషి వెళ్ళి.. "అన్నయ్య గురించి మీరు ఏం బాధ పడకండి.. నేను రప్పిస్తాను. ఇన్ని రోజులు చాలా ఓపికగా వెయిట్ చేశారు. వదిన మీరు చాలా గ్రేట్" అని రిషి అంటాడు. వీళ్ళిద్దరి మాటలు దేవయాని చాటుగా వింటుంది. అనవసరంగా ఆ వసుధార శైలేంద్ర టాపిక్ తీసింది.. ఇప్పుడు రిషి ఏమో శైలేంద్రని తీసుకొస్తా అంటున్నాడు. ఏం చేసైనా శైలేంద్రని రాకుండా చెయ్యాలని దేవయాని తన మనసులో అనుకుంటుంది.

మరోవైపు వసుధారని వెతుక్కుంటూ రిషి ఇంటి డాబా పైకి వెళ్తాడు. రిషి వెళ్ళేసరికి వసుధార తన నాన్నతో ఫోన్ మాట్లాడుతుంది. నీ కోసం చాలా సేపటి నుండి వెతుకుతున్నానని రిషి అంటాడు. ఒక్క ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా సర్ అని వసుధార అంటుంది. కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. "నువ్వు ఈ ఇంటికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది వసుధార.. నువ్వు వచ్చాక నేను మళ్ళీ కొత్తగా పుట్టానేమో అనిపిస్తుంది" అని రిషి అంటాడు. మన మధ్య ప్రేమ ఎంతుందో దూరం కూడా అంతే ఉందని అంటుంది వసుధార. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకున్న తర్వాత.. "గుడ్ నైట్ చెప్పి వెళ్ళండి సర్" అని వసుధార అనగానే.. నువ్వు చెప్పొచ్చు కదా అని రిషి అంటాడు. రిషి, వసుధార ఇద్దరు మాట్లాడుకునే మాటలన్ని దేవాయని చాటుగా వింటుంది.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం.. అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. ఎప్పుడు లేనిది దేవయాని అందరికి కాఫీ చేసుకొని తీసుకువస్తుంది. ఈ రోజు ఎవరు కాలేజీకి వెళ్ళట్లేదు. ఈ రోజు ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. అన్ని ఏర్పాట్లు చేశాను అని అంటుంది.. ఇలా దేవాయని సడన్ గా పూజ అంటుందేంటి. ఇందులో ఏదో ప్లాన్ ఉందని జగతి, మహేంద్రలు అనుకుంటారు. జగతి మనిద్దరం కలిసి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. నన్ను ఎప్పుడు కూడా గయ్యాళి లాగా చూస్తారు కదా.. నేను కూడా అందరి గురించి ఆలోచిస్తానని అర్ధం చేసుకోమని జగతితో దేవయాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.