English | Telugu

Jayam serial: వీరూనే అదంతా చేశాడని తెలుసుకున్న గంగ.. ఏం చేయనుంది?

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -156 లో... శేఖర్ నిజం చెప్పాలని గంగ యాక్టింగ్ చేస్తుంది. దాంతో శేఖర్ నిజం చెప్తాడు. అదంతా రుద్ర వింటాడు. అసలు నీతో ఇదంతా ఎవరు చేస్తున్నారన్నా అని గంగ అనగానే శేఖర్ పారిపోతాడు. శేఖర్ కి ఎదురుగా రుద్ర వచ్చి ఆపుతాడు. గంగ, శ్రీనన్న వస్తారు. గంగ చెంప రుద్ర చెల్లుమనిపిస్తాడు. అసలు నువ్వు ఇలా ఎందుకు యాక్టింగ్ చేసావ్.. ఇంకా ఇంట్లో నుండి లెటర్ రాసి పెట్టి వచ్చావ్.. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని గంగపై రుద్ర కోప్పడతాడు.

ఆ తర్వాత శేఖర్ ని రుద్ర బెదిరించగా జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో నిన్ను కాంటాక్ట్ అయిన నెంబర్ ఇవ్వమని రుద్ర అనగానే అతను నెంబర్ ఇస్తాడు. రుద్ర అతనికి ఫోన్ చేస్తాడు ఫోన్ స్విచాఫ్ వస్తుంది. అత్తయ్య ముందు శేఖరన్నా నువ్వు నిజం చెప్పాలని తనని ఇంటికి తీసుకొని వెళ్తారు... గంగని చూసి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగ చెంపపై వేలిముద్ర చూసి ఎవరు కొట్టారని పెద్దసారు అడుగుతాడు. నేనే కొట్టాను నిజం చెప్పించడానికి చనిపోయినట్లు యాక్టింగ్ చేసింది అందుకే కొట్టానని రుద్ర చెప్తాడు. శేఖర్ రాగానే వీరు టెన్షన్ పడతాడు. శేఖర్ ఇంట్లో వాళ్ళకి జరిగింది మొత్తం చెప్తాడు. నన్ను బ్లాక్ మెయిల్ చేసిన అతను కూడా వీరు సర్ లాగే పొడవు ఉంటారని శేఖర్ చెప్తాడు.

ఆ తర్వాత గంగ చెంపపై ఉన్న నొప్పికి ఇబ్బంది పడుతుంటే రుద్ర వచ్చి కూల్ బ్యాగ్ ఇచ్చి పెట్టుకోమ్మంటాడు. అనుకోకుండా రుద్ర వెళ్లిపోతుంటే గంగపై పడుతాడు. గంగ రొమాంటిక్ గా ఫీల్ అవుతుంది. సారీ గంగ నిన్ను కొట్టినందుకు అని చెప్పి వెళ్లిపోతుంటే గంగ సిగ్గుపడుతుంది. మరొకవైపు ఆ శేఖర్ గాడు లాస్ట్ మినిట్ లో ఇలా చేసాడని ఇషిక, వీరు డిజప్పాయింట్ అవుతారు.

ఆ తర్వాత వీరు దగ్గరికి గంగ వచ్చి ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు అన్నయ్య అని గంగ అనగానే వీరు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.