English | Telugu

Brahmamudi: విషం కలిపిన పసరు మందుని తాగిన కావ్య.. రుద్రాణి ప్లాన్ సక్సెస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-919 లో... రాజ్ బావ నాకు కావాలని రేఖ అనగానే దానికి రాహుల్ ఒప్పుకొని కావ్య కడుపులో బిడ్డని లేకుండా చేయాలని చెప్తాడు. రేఖని ఆ ఇంటికి కోడలుగా చెయ్యాలని రాహుల్ ప్లాన్ చెయ్యగా.. చాలా థాంక్స్ అన్నయ్య అని రేఖ అంటుంది. మీరు ఇద్దరు ఒకే అంటే చేసేదేముంది నా కూతురు ఈ ఇంటికి కోడలు అవుతుంది.. అంతకంటే ఏముందని రుద్రాణి అంటుంది.

మరొకవైపు ఇద్దరు అక్కాచెల్లెలు అప్పు, కావ్య కడుపుతో కూర్చొలేక నిల్చొలేక ఇబ్బందిపడుతారు. దాంతో అప్పు, కావ్య ఇద్దరు తమ భర్తల దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇలా రెస్ట్ తీసుకొమ్మంటే మాకు ఇబ్బందిగా ఉందని అంటారు.

ఇక రాత్రి రుద్రాణికి పసరు మందు వైద్యుడు ఫోన్ చేసి మీరు చెప్పిన మందు తీసుకొని వచ్చానని చెప్పగానే సరే ఉండు వస్తున్నానని రుద్రాణి వెళ్తుంది. అప్పుడే తనకి ప్రకాష్ ఎదురుపడుతాడు. దాంతో రుద్రాణి భయపడుతుంది. కానీ ప్రకాష్ నిద్రలో నడుస్తాడు అది చూసి రుద్రాణి రిలాక్స్ అవుతుంది. ఇక రుద్రాణి బయటకు వెళ్లి పసరు మందు తీసుకొని వస్తుంది.

మరుసటి రోజు ప్రకాష్, సుభాష్ ఆఫీస్ కి వెళ్ళడానికి త్వరగా టిఫిన్ చేస్తుంటారు. దాంతో రాజ్ వచ్చి ఎవరు ఈ రోజు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్తాడు.

మరొకవైపు రాజ్ గదిలోకి రుద్రాణి, రేఖ వెళ్లి పసరు మందు తను తాగే ఆయుర్వేద మందులో కలుపుతారు. ఈ దెబ్బతో కావ్య బిడ్డ ఉండదని రుద్రాణి, రేఖ అనుకుంటారు.

ఆ తర్వాత ఏదో ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్ అన్నావ్ రాజ్ ఎక్కడ అని ప్రకాష్ అనగానే.. రాజ్, కళ్యాణ్ కలిసి కొన్ని చీటీలు రాసి అందులో ఏది వస్తే అది చెయ్యాలని చెప్తారు.

తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ఆయుర్వేద మందు ఇస్తాడు. అది కావ్య తాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.