English | Telugu

పెళ్ళి అయింది సరే.. ఆ తర్వాత తంతు సంగతేంటి?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌-716 లో... కాలేజీ నుండి రిషి, వసుధార కార్ లో ఇంటికి వస్తుంటారు. తన మీద రిషికి ఉన్న కోపం తగ్గించడానికి ప్రేమగా మాట్లాడుతుంది వసుధార. ఆ తర్వాత ఇంటికి వెళ్తారు.

డైనింగ్ టేబుల్ దగ్గర వసుధార, రిషి, దేవయాని, జగతి, మహేంద్ర, ఫణీంద్ర భూషన్ అందరు కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటారు. అందరికి ధరణి వడ్డిస్తుంటుంది. ఎందుకు ధరణి ఇంత కష్టపడుతున్నావ్.. మాతో పాటు నువ్వు కూడా తినమని, కుర్చీలో కూర్చోమని చెప్తుంది దేవయాని. ఆ తర్వాత వసుధారని ఉద్దేశించి మాట్లాడుతుంది. ఎక్కడి వసయధార ఎక్కడికి వచ్చింది. కాలేజీ స్టూడెంట్ లాగా పరిచయమై మిషన్ ఎడ్యుకేషన్ కి హెడ్ అయింది.. ఇప్పుడు ఈ ఇంటికి కోడలు అయిందని వసుధారని ఉద్దేశించి ధరణితో చెప్తుంది దేవయాని. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని వసుధార అడుగగా.. పెళ్ళి అయింది ఆ తర్వాత తంతు ఏమీ జరుగలేదు కదా.. అసలు పెళ్ళి అయిన ఇల్లులా ఉందా అని అందరితో చెప్తుంది దేవయాని. అది విని రిషి ఎందుకు పెద్దమ్మ ఇప్పుడు అవన్నీ అని అంటాడు. నీకేం తెలియదు ఊరుకో అని అంటుంది దేవయాని. ఆ తర్వాత దేవయాని పదే పదే సంప్రదాయాలు తంతు అంటూ జరిపించాలని చెప్తుంటే.. రిషి అక్కడ నుండి తినకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి, జగతి వాళ్ళ గదిలో కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడే వారి దగ్గరికి వసుధార వస్తుంది. ఈ సమస్యని మీరిద్దరు అనుకొని సాల్వ్ చేసుకోవాలని వసుధారతో జగతి చెప్తుంది. దాంతో వసుధార ఆలోచిస్తూ రిషి గది వైపు వస్తుంది.

రిషి దగ్గరికి వసుధార వస్తుంది. ఏంటి ఇలా వచ్చావ్ అని రిషి అడుగగా.. ఏం లేదు సర్ పిల్లుల సౌండ్స్ వినిపిస్తే వచ్చానని వసుధార అంటుంది. ఇద్దరం ఎదురెదురుగా ఉన్నాం కానీ తెలియనంత దూరం మన మధ్యలో ఉందని వసుధార అనుకుంటుంది. నాతో ఏమైనా మాట్లాడాలా అదే పెద్దమ్మ అడిగినదాని గురించి నన్నేమైనా అడుగాలనుకుంటున్నావా అని రిషి అడుగగా.. నా మనసులో సమాధానాలే ఉన్నాయి సర్ ప్రశ్నలేమీ లేవని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.