English | Telugu

Brahmamudi : గోల్డ్ బాబుని ఇంప్రెస్ చేయడానికి కోయిలి ప్లాన్.. ఒకే చెప్పిన రంజిత్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ - 870 లో..క్లయింట్ కి ఇవ్వాల్సిన కొటేషన్ సిస్టమ్ లో లేదని సుభాష్ కి శృతి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో సుభాష్ టెన్షన్ పడతాడు. ఒకవేళ క్లయింట్ వెళ్ళిపోతే యాభై కోట్ల లాస్ వస్తుందని రాజ్ కి సుభాష్ కాల్ చేసి చెప్తాడు. వెంటనే అక్కడ నుండి బయల్దేరండి అని సుభాష్ చెప్తాడు. అప్పుడే కావ్య వస్తుంది. కావ్యకి విషయం చెప్పి మనం ఇప్పుడు బయల్దేరాలని చెప్తాడు. అవసరం లేదు ఆ కొటేషన్ నా సిస్టమ్ లో సేవ్ చేసి పెట్టానని కావ్య చెప్తుంది. దాంతో రాజ్ రిలాక్స్ అవుతాడు.

ఆ తర్వాత ప్రకాష్ కి కావ్య ఫోన్ చేసి కొటేషన్ తన సిస్టమ్ లో ఉన్న విషయం చెప్తుంది. దాంతో అందరు రిలాక్స్ అవుతారు. రుద్రాణి మాత్రం ప్లాన్ ఫెయిల్ అయిందని డిస్సపాయింట్ అవుతుంది. మరొకవైపు గోల్డ్ బాబూ దగ్గరికి కొయిలి వస్తుంది. ఈ టైమ్ కి పార్టీలో ఉండి ఎంజాయ్ చేసేవాడిని అని గోల్డ్ బాబూ అంటాడు. మీరెందుకు టెన్షన్ పడుతారు. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారు. మీకు పార్టీ అరెంజ్ చేస్తానని కోయిలి చెప్తుంది. రంజిత్ దగ్గరికి వెళ్లి అర్జెంట్ గా ఒక లక్ష కావాలి గోల్డ్ బాబుకి పార్టీ కావాలట అని చెప్తుంది. ఇప్పటికే అప్పు చాలా చేసామని రంజిత్ అంటాడు. ఆ గోల్డ్ బాబుని ఇంప్రెస్ చేసి వాడి బంగారం మొత్తం లాగేసుకుందామని కోయిలి అనగానే రంజిత్ సరే అంటాడు.

ఆ తర్వాత రాజ్, కావ్యకి ఇందిరాదేవి, అపర్ణ వీడియో కాల్ చేస్తారు. వాళ్ళ గెటప్ చూసి ఇందిరాదేవి వాళ్ళు నవ్వుకుంటారు. ఎలాగైనా రాహుల్ కి బుద్ధి చెప్పి ఇంటికి తీసుకొని వస్తామని స్వప్నకి కావ్య ధైర్యం చెప్తుంది. మరొకవైపు పార్టీకి అన్నీ రెడీ చేసి కోయిలి ఫ్యాషన్ డ్రెస్ లో వస్తుంది. తనని చూసి రాహుల్ షాక్ అవుతాడు. ఇలాంటి బట్టలు ఎందుకు వేసావని అడుగుతాడు. నీకు ఇలాగే ఇష్టం కదా అని కోయిలి అంటుంది. నేను ఒక్కడే ఉన్నప్పుడు వేసుకోవాలి.. ఇలా అందరున్నప్పుడు కాదని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.