English | Telugu

Brahmamudi : నగలు దొంగతనం చేసింది రాహుల్.. అప్పు, స్వప్నల ఇన్వెస్టిగేషన్ షురూ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -765 లో.... రాజ్ కి బాస్ లాగా ట్రైనింగ్ ఇస్తుంది కావ్య. అందరిలో ఆఫీస్ లో ఎలా నడవాలి.. ఎలా తినాలి.. ఇలా ప్రతీది ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అదంతా రుద్రాణి చూసి యామినికి ఫోన్ చేసి చెప్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రాజ్ ఆఫీస్ కి రాకుండా చేయమని యామినికి చెప్తుంది రుద్రాణి. మరొకవైపు స్వప్న దగ్గరికి అప్పు వస్తుంది. అక్క నీకు ఎలా కనిపిస్తున్నాను.. గిల్టీ నగలు ఇచ్చి నన్ను మెరుగు పెట్టించమని ఇచ్చావని అప్పు అనగానే స్వప్న షాక్ అవుతుంది.

ఏం మాట్లాడుతున్నావే అవి తాతయ్య గారు ఇచ్చిన ఏడు వరాల నగలు అని స్వప్న అనగానే.. చూడు ఒకసారి వీటిని ఒరిజినల్ నగలు అంటారా అనగానే స్వప్న వాటిని చూసి షాక్ అవుతుంది. రాహుల్ నగలు లోపల పెట్టేటప్పుడు చూసింది గుర్తు చేసుకొని అసలు రాహుల్ ఆల్రెడీ నగలు తీసుకొని గిల్టీ నగలు పెడుతుండగా చూసా కానీ అప్పుడు నగలు దొంగతనం చేస్తున్నాడని గొడవ అయిందని స్వప్న అంటుంది. నా మొగుడు ఎలాంటి వాడో చూసావా అని స్వప్న బాధపడుతుంది. అసలు రాహుల్ నగలు తియ్యాల్సిన అవసరం ఏంటి? మనం ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని అప్పుతో స్వప్న అంటుంది. మరొకవైపు కావ్యతో రాజ్ ఫోన్ చేసి మాట్లాడతాడు.

ఆ తర్వాత స్వప్న కావాలనే లాకర్ కీస్ రాహుల్ కి కనపడేలా పెడుతుంది. కావాలనే అప్పుతో ఫోన్ లో మాట్లాడినట్లు చేస్తుంది. అప్పు నాతో మాట్లాడాలి అంట నేను వెళ్తున్నాను.. పాపని చూడమని రాహుల్ తో స్వప్న అనగానే రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్వప్న వెళ్ళగానే లాకర్ నుండీ ప్రాపర్టీ పేపర్స్ తీసుకొని రాహుల్ వెళ్తాడు. అదంతా అప్పు, స్వప్న చూస్తారు. అసలు రాహుల్ ఏం చేస్తాడో చూడాలని ఇద్దరు అనుకుంటారు. మరుసటి రోజు రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. రాజ్ రాగానే శృతి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.