English | Telugu

Brahmamudi : ఇంటికొచ్చిన సీతారామయ్య.. ఆస్తిలో వాటాలు ఇవ్వమన్న ధాన్యలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -642 లో... బారసాల ఫంక్షన్ లో అందరు సంతోషంగా ఉంటారు. అప్పుడే అనామిక ఎంట్రీ ఇస్తుంది. రాజ్, కావ్యలు ఇంట్లో ఎవరికి తెలియకుండా వందకోట్లు అప్పు చేశారని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ అప్పు తీర్చడం కోసం ఆస్తులు తాకట్టు పెట్టారని చెప్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అనామిక ఇంట్లో వాళ్లకి ఇస్తుంది. ఇంత అప్పు చేసి ఆ డబ్బేం చేసారని ధాన్యలక్ష్మి అడుగుతుంది.

అంత మెల్లగా అడుగుతావేంటని ధాన్యలక్ష్మిని రుద్రాణి ఇంకా రెచ్చగొడుతుంది. ఇంట్లో గొడవ రాజేశానంటూ అనామిక వెళ్ళిపోతుంది. కావ్య ఏదో చెప్పబోతుంటే రాజ్ ఆపి ఈ విషయం లో కావ్య ఏం చేసిన నాకూ తెలిసే చేసింది.. అప్పు మాట నిజమే కానీ మేం అప్పు తీరుస్తాం. ఇప్పటికే ఇరవై అయిదు కోట్లు తీర్చామని రాజ్ చెప్తాడు. మేం ఇప్పుడేం జరిగిందని చెప్పే సిచువేషన్ లో లేము.. వినే సిచువేషన్ లో మీరు లేరని రాజ్ చెప్పి కావ్యని తీసుకొని వెళ్ళిపోతాడు. అసలేం జరుగుతుందో అంత తెలుసుకుంటానని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు రాజ్ , కావ్య లు ఎందుకు అప్పు చేశారుని అపర్ణ, సుభాష్ లు ఆలోచిస్తుంటారు.

అసలు అనామికకి దీని గురించి ఎలా తెలుసని రాజ్ తో కావ్య అంటుంది. ఇంకా నయం తాతయ్య గురించి నిజం బయటపడలేదు. ఈ లోపు మిగతా అప్పు కూడా తీర్చేయ్యాలని రాజ్ అంటాడు. అనామిక తను చేసిన పనికి హ్యాపీగా ఫీల్ అవుతూ సామంత్ కి చెప్తుంది. రేపు బ్యాంకు నుండి ఆఫీసర్స్ వెళ్లి ఇంటిని జప్తు చేస్తారు. అప్పుడు ఆఫీస్ ని తక్కువ రేట్ కి మనం తీసుకుంటామని అనామిక ప్లాన్ చేస్తుంది. ప్రకాశ్, కళ్యాణ్ లకి ఆస్తుల గురించి మాట్లాడాలంటూ ధాన్యలక్ష్మి చెప్తుంటుంది. ఇంట్లో ఇంత జరుగుతుంది.. ఆస్తులు వాటా అంటున్నారు అంటూ ధాన్యలక్ష్మి పై కళ్యాణ్ అరుస్తాడు. తరువాయి భాగంలో బ్యాంకు వాళ్ళు వస్తారు. టైమ్ కి అప్పు కట్టలేదు కాబట్టి ఇంటిని జప్తు చేస్తామని అంటారు. సుభాష్ వచ్చి నందగోపాల్ మోసం చేసిన విషయం చెప్తాడు. మాకు రావల్సిన ఆస్తులు మాకు ఇవ్వండి అని ధాన్యలక్ష్మి కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే సీతారామయ్య, ఇందిరాదేవిలు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.