English | Telugu

Brahmamudi : కార్ నెంబర్ ద్వారా యామిని వివరాలని కావ్య తెలుసుకుంటుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -678 లో.....ఆ కావ్య అంత ఖచ్చితంగా చెప్తుందంటే నిజంగానే రాజ్ బ్రతికి ఉన్నాడు కావచ్చని రుద్రాణి తో రాహుల్ అంటాడు. అది మనకి చెప్పి మంచి పని చేసింది.. ఒకవేళ వాడు బ్రతికున్నా కూడ మనం ఉండనివ్వం కదా అని రుద్రాణి అనగానే.. మనకి రాజ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా అని రాహుల్ అంటాడు. కావ్య ఖచ్చితంగా రాజ్ దగ్గరికి వెళ్తుంది. కావ్య ద్వారా రాజ్ ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు.. నువ్వు కావ్యపై ఓ కన్నెసి ఉంచమని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది.

మరొకవైపు దేవుడికి కావ్య మొక్కుతు బాధపడుతుంది. కావ్య కి సడెన్ గా రాజ్ వెళ్ళిన కార్ నెంబర్ గుర్తు వస్తుంది. ఆ తర్వాత రాజ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే.. చూసారా మీ అల్లుడు గతాన్ని గుర్తుతెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు.. మీరు వెళ్లి డైవర్ట్ చెయ్యండి అని తన పేరెంట్స్ తో యామిని చెప్తుంది. దాంతో యామిని పేరెంట్స్ రాజ్ దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ఈ రోజు మీ అమ్మాయి మా అమ్మానాన్న సమాధులు అంటూ తీసుకోని వెళ్ళింది కానీ అక్కడ చుస్తే నాకేం గుర్తురాలేదని వాళ్ళతో రాజ్ చెప్తాడు. యామినితో పాటు తన పేరెంట్స్ ఎంత మభ్యపెట్టాలని చూసిన రాజ్ మాత్రం అవేం పట్టించుకోడు. ఆ తర్వాత అప్పు దగ్గరికి కావ్య వెళ్లి.. అయన వెళ్ళిన కార్ నంబర్ ఇది డీటెయిల్స్ కనుక్కోమని చెప్తుంది. అయినా నువ్వు బావని ఒక అమ్మాయితో చూసానన్నావని అప్పు అడుగుతుంది. అవును కానీ ఆయన గతం మర్చిపోయాడు.. అదంతా డీటెయిల్ గా కనుక్కొని చెప్తానని కావ్య అంటుంది.

ఆ తర్వాత అప్పు కార్ నెంబర్ ద్వారా డీటెయిల్స్ కనుక్కొని కావ్య కి చెప్తుంది. కావ్య రెడీ అయి బయటకు వెళ్తుంటే అందరు హాల్లోనే ఉంటారు. ఇలా ప్రతి రోజు వెళ్తే చూసే జనాలు ఏం అనుకుంటారని రుద్రాణి అంటుంది. మీ భర్త మీకు దూరంగా ఉండి ఇరవై సంవత్సరాలవుతుంది అయినా మీరు బానే ఉన్నారు కదా.. నిన్న మొన్న వరకు నా భర్త ఉన్నాడు.. ఇప్పుడు కూడా ఉన్నాడంటే ఎందుకు మీరు నమ్మడం లేదని రుద్రాణికి కావ్య కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.