English | Telugu

Brahmamudi : రాజ్ కి భార్య స్పర్శ తెలిసింది.. డౌట్ పడిన యామిని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -672 లో..... రాజ్ ని తీసుకొని లండన్ వెళ్తాను.. ఇక్కడుంటే తనవాళ్లు ఎవరైనా చూస్తే మళ్ళీ తనకి గతం గుర్తుకి వచ్చే ప్రమాదం ఉందని తన పేరెంట్స్ తో యామిని చెప్తుంది. ఇన్నిరోజులు మాకు దూరంగా ఉన్నావ్.. ఇప్పుడు కూడా దూరంగా వెళ్తానంటే మేమ్ ఎలా ఒప్పుకుంటామని యామినితో తన పేరెంట్స్ అంటారు. ఇప్పటికే తప్పు చేస్తూ మా నోరు ముయిస్తున్నావంటూ వాళ్ళ నాన్న కఠినంగా మాట్లాడతాడు.

నేను వెళ్తానని యామిని చెప్తుంటే.. అప్పుడే ఏమైందంటూ రాజ్ వస్తాడు. అంత వినేశాడా ఎంటని యామిని టెన్షన్ పడుతుంది. దేని గురించి మాట్లాడుకుంటున్నారని రాజ్ అడుగగా నాకు తెలియదు వాళ్ళిద్దరిని అడుగమని యామిని వాళ్ళ నాన్న అంటాడు. ఏం లేదు బావ.. లండన్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకొని సెటిలవ్వాలని అంటున్నానని రాజ్ తో యామిని అంటుంది. ఇప్పుడే కదా సెట్ అవుతుంది. పెళ్లి ఏంటి వద్దు ఇక్కడే ఉందామని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు రాజ్ తన పక్కన ఉన్నట్లు గాజులు తొడిగినట్లు కావ్య ఉహించుకుంటుంది. అదంతా ఇందిరాదేవి చూస్తుంది. కిందకి వచ్చి కావ్యని చుస్తే బాధేస్తుంది రాజ్ ఉన్నాడని భ్రమలో బ్రతుకుతుందని ఇందిరాదేవి అంటుంది. అవును డాక్టర్ ని పిలిస్తే బెటర్ అని ధాన్యాలక్ష్మి అంటుంటే.. డాక్టర్ తో పాటు పంతులిని కూడా పిలవాలని రుద్రాణి అంటుంది. ఎందుకని ఇందిరాదేవి అడుగుతుంది. రాజ్ కి చెయ్యాలిసిన కార్యక్రమం చెయ్యాలి కదా అని రుద్రాణి అంటుంది. దాంతో అందరు తనపై కోప్పడతారు. కావ్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిన విషయం రాజ్ గుర్తు చేసుకుంటాడు. వెనకాల నుండి యామిని వచ్చి రాజ్ భుజం పై చెయ్ వేస్తుంది. నీ స్పర్శ నాకు తెలిసిన వాళ్ళ స్పర్శలా లేదు ప్రొద్దున ఒక అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళానని చెప్పాను కదా ఆవిడ స్పర్శ నాకు తెలిసినా ఆవిడ స్పర్శ లాగా అనిపించిందని రాజ్ చెప్తాడు. ఎవరై ఉంటారని యామిని అనుకొని.. ఎవరోలే మన ఫ్రెండ్స్ అయి ఉంటారని డైవర్ట్ చేస్తుంది.

ఇక్కడే ఉంటే రాజ్ కి గతం గుర్తుకి వస్తుంది. వెంటనే నేను లండన్ కి తీసుకొని వెళ్ళాలని యామిని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం రాజ్ కి కర్మకాండ నిర్వహిస్తారు. ఇందిరాదేవి , అపర్ణ ఇద్దరు బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.