English | Telugu

Brahmamudi : యామిని హ్యాపీ.. భర్త బ్రతికే ఉన్నాడని చెప్తూ కావ్య పూజలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -666 లో..... డాక్టర్ వచ్చి రాజ్ గతం మర్చిపోయాడని చెప్పగానే యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా రాజ్ నా కోసం మళ్ళీ పుట్టాడని యామిని అంటుంది. మరొకవైపు రాజ్ షర్ట్ పట్టుకొని అపర్ణ ఏడుస్తుంటుంది. కావ్య మాటలు విని నాకు నమ్మకం ఉంది రాజ్ బ్రతికే ఉన్నాడని ఇందిరాదేవి అంటుంది. కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఎందుకు డల్ గా ఉన్నాడని ధాన్యలక్ష్మి అంటుంది. అసలేం జరిగింది ఏవైనా చెప్పేది మిగిలి ఉందా అని అపర్ణ అంటుంది. దాంతో చెప్పడానికి కళ్యాణ్ ఇబ్బంది పడతాడు.

ఆ తర్వాత ఏం జరిగిందని అప్పుని కనకం అడుగుతుంది. అప్పు బాధపడుతూ.. బావ లేడు అని చెప్పగానే అందరు గుండెపగిలేలా ఏడుస్తారు. లేదు అలా జరగదు అని అపర్ణ అంటుంటే రాజ్ కి సంబంధించిన వస్తువులు అప్పు చూపిస్తుంది. అవి చుసి అందరూ ఏడుస్తారు. మరోవైపు అక్కడ జరుగుతుంది అంతా చూసి యామిని దగ్గరికి రౌడీ వెళ్తాడు. వాళ్ళంతా రాజ్ చనిపోయాడనుకుంటున్నారని తన గురించి సెర్చ్ చెయ్యరని రౌడీ చెప్పగానే.. యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ దగ్గరికి వెళ్లి బావ నీకు ఏం కాలేదు కదా అంటూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఇదిగో మా అమ్మనాన్న వీళ్ళు కూడా గుర్తులేరా అని యామిని అంటుంది. ఎవరు మీరంతా నా వాళ్ళు ఎక్కడ అని రాజ్ అడుగుతాడు. డాక్టర్ వచ్చి వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్తాడు. యామిని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. ఇక నేను చెప్పినట్టు చెయ్యండి లేకపోతే నేను ముందులా మరిపోతానని తన పేరెంట్స్ ని యామిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ తర్వాత యామిని పేరెంట్స్ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అక్కడ పక్కనే కనకం కూర్చొని ఉంటుంది. ఏమైందని కనకం అడుగుతుంది నాకు కాబోయ్ అల్లుడికి ఆక్సిడెంట్ అయింది.. గతం మర్చిపోయాడు నా కూతురు అతన్నే పెళ్లి చేసుకుంటానని అంటుంది. తనకి ఇచ్చి చెయ్యండి అప్పుడే నీ కూతురు హ్యాపీగా ఉంటుందని కనకం కూడా చెప్తుంది.

ఇప్పటివరకు డైలామాలో ఉన్నాం.. ఇప్పుడు రిలీఫ్ గా ఉందని యామిని వాళ్ల నాన్న అంటాడు. మా అల్లుడు అక్కడున్నాడని కనకంని వాళ్ళు తీసుకొని వెళ్తుంటే అప్పుడే కనకంని పిలుస్తుంది అప్పు. ఆ తర్వాత అందరు కావ్య దగ్గరికి వెళ్తారు. మా ఆయన బ్రతికే ఉన్నాడని కావ్య అంటుంది. తరువాయి భాగంలో కావ్య వంట చేసి అందరిని పిలుస్తుంది. మాకూ ఆకలిగా లేదని అపర్ణ వాళ్ళు అంటారు. రాజ్ లేడని ఆకలిగా లేదని చెప్పండి అని రుద్రాణి అనగానే.. మా ఆయన ఉన్నాడని కావ్య అంటుంది. మా ఆయన ఎక్కడున్నా నేను తీసుకొని వస్తానని కావ్య దేవుడికి మొక్కుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.