English | Telugu

Brahmamudi : సీతారామయ్య నిర్ణయంతో రుద్రాణి షాక్.. కుటుంబం విచ్ఛిన్నం అవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -644 లో.... ఆస్తుల్లో మా వాటాలు మాకిచ్చి మీరు ఏమైనా చేసుకోండి అంటూ ధాన్యలక్ష్మి కఠినంగా మాట్లాడుతుంటే.. అప్పుడే ఇందిరాదేవి, సీతారామయ్య వస్తారు. నా మాటకి విలువ లేనప్పుడు.. నా ఆస్తులు ఎందుకని సీతారామయ్య ముక్కుసూటిగా మాట్లాడతాడు. అంటే మీ వారసుల గురించి ఆలోచించరా అని ధాన్యలక్ష్మి అనగానే.. మాటకి విలువ ఇవ్వనివారు ఎలా వారసులు అవుతారని ఇందిరాదేవి అంటుంది. రాజ్ నువ్వు ఆస్తులు అమ్మి ఆ అప్పు కట్టు అంటూ రాజ్ కి సీతారామయ్య చెప్తాడు.

పేపర్స్ అన్ని లాకర్ లో ఉన్నాయ్ రేపు సబ్ మిట్ చేస్తానని రాజ్ అనగానే.. సరే రేపు వస్తామంటూ బ్యాంక్ వాళ్ళు వెళ్ళిపోతారు. మనిషికో దారిని చూసుకుందామంటూ రుద్రాణి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రుద్రాణి, రాహుల్ లు బయట కూర్చుని అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి అన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకొని బాధపడుతుంటారు. అప్పుడే స్వప్న వచ్చి రుద్రాణి చేతిలో ఒక గిన్నె పెట్టి ఇప్పుడు మీ సిచువేషన్ ఇదే అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఒకసారి మీరు ముష్టి ఎత్తుతున్నట్లు ఉహించుకోండి అనగానే ఇద్దరు ఆడుక్కున్నట్టు ఉహించుకొని టెన్షన్ పడతారు. మరొకవైపు ప్రకాష్, సుభాష్ ఇందిరాదేవి, అపర్ణ లు మాట్లాడుకుంటారు. ప్రకాష్ పూర్తిగా ధాన్యలక్ష్మి చెప్పినట్టు వింటున్నాడని ఇందిరాదేవి, అపర్ణ లు అంటుంటారు. ప్రకాష్ సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వాడు మళ్ళీ మారేలా లేడని ఇందిరాదేవి బాధపడుతుంది.

రాజ్, కావ్యలు ఇంట్లో జరిగిన దానికి బాధపడుతుంటారు. మరొకవైపు కుటుంబం విచ్ఛిన్నం అవుతుందని సీతారామయ్య ఇందిరదేవితో చెప్తూ బాధపడతాడు. అప్పు స్టేషన్ లో ఉండగా కళ్యాణ్ తనకి క్యారేజ్ తీసుకొని వస్తాడు. దాంతో అప్పు ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.