English | Telugu

Brahmamudi : స్వప్న శ్రీమంతానికి అరవై లక్షల ఖర్చు.. రుద్రాణి కొత్త ప్లాన్ !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -615 లో.... ప్రకాష్ దగ్గరికి సుభాష్ వస్తాడు. ఈరోజుతో ఇంట్లో నా విలువ తెలిసిందని బాధపడుతుంటే.. కావ్య ఎందుకు ఇలా చేస్తుందో కనుక్కుంటాను.. నువ్వేం బాధపడకు కొంచెం టైమ్ ఇవ్వమని సుభాష్ అంటాడు. ఆ తర్వాత ప్రకాష్ దగ్గరికి కావ్య వస్తుంది. సారీ మావయ్య మీతో అలా మాట్లాడాల్సి ఉండకూడదని చెప్తుంది‌. నేను కంపెనీకి లాభం తెచ్చే పని చేసినా కూడా నువ్వు వద్దని అపావంటూ కఠినంగానే ప్రకాష్ మాట్లాడతాడు.

మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా మావయ్య అంటూ కావ్య బాధపడుతుంది. ధాన్యలక్ష్మి వచ్చి ఏం నటిస్తున్నావ్.. అందరి ముందు అలా మాట్లాడి ఇప్పుడిలా చెప్తున్నావా అంటు కావ్యపై కోప్పడుతుంది. మీరెందుకు రాను రాను ఇలా మాట్లాడుతున్నారు చిన్న అత్తయ్య అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య ఏడుస్తుంది. కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. మొదటిసారి నీ కంట్లో కన్నీరు చూడడం ఇప్పుడు జరిగిందంతా చూసాను.. ఇదంతా ఎందుకు తాతయ్య మాట విషయం ఇంట్లో చెప్పేద్దామని రాజ్ అనగానే.. వద్దు ఈ విషయం తెలిస్తే ఆస్తుల కోసం రుద్రాణి, ధాన్యలక్ష్మి లు కోర్ట్ కి వెళ్తారని కావ్య అంటుంది. మరొకవైపు రుద్రాణి, రాహుల్ లు ప్రకాష్ ని పూర్తిగా తన వైపుకి తిప్పుకోవాలనుకుంటారు. స్వప్నకి శ్రీమంతం చెయ్యాలని నిర్ణయం తీసుకుంటుంది రుద్రాణి. మరుసటి రోజు ఉదయం శాంత వచ్చి.. ఏం టిఫిన్ చెయ్యాలని రుద్రాణిని అడుగుతుంది.

నన్నెందుకు అడుగుతున్నావని రుద్రాణి అనగా.. ఇకనుండి ఇంట్లో అందరికి నచ్చినవి వండమని కావ్య మేడమ్ చెప్పిందని శాంత అంటుంది. నేను స్వప్నకి శ్రీమంతం చెయ్యాలనుకుంటున్నానని రుద్రాణి అనగానే.. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావ అంటూ స్వప్న ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును చేద్దామనుకుంటున్నా ఒక ప్లాన్ కూడా వేసుకున్నానని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో శ్రీమంతానికి కావల్సిన లిస్ట్ రుద్రాణి రాస్తుంది. అది మొత్తం ఇరవై లక్షల ఖర్చు ఉంటుంది. అది రాసి కావ్యకి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.