English | Telugu

Brahmamudi : పడుతోంది ఓ బ్రహ్మముడి.. కలిపేనా ఆ ఇరువురిని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -542 లో....కనకం కృష్ణమూర్తిలు ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు. ఆ తర్వాత రాజ్, కావ్య తినిపిస్తారు. అలా ఒక్కొక్కరు వెళ్లి కేక్ తినిపించి ఇద్దరిని విష్ చేస్తారు. మీకు పెళ్లి అయి ఇరవై అయిదు ఏళ్ళు గడిచింది. మాకు పెళ్లి అయి యాభై సంవత్సరాలు అవుతుంది. నా పెద్ద కొడుకు పెళ్లి అయి ముప్పై సంవత్సరాలు అవుతుంది. అబ్బాయి ఒక ఇంట్లో పుడతాడు అమ్మాయి ఒక ఇంట్లో పుడుతుంది ఆ ఇద్దరి కలిసి బ్రతకడం కోసం ఒకటి అయి ఒక దగ్గరుంటారని ఇందిరాదేవి అంటుంది.

రాజ్ కి అర్థం అవ్వాలని.. ఒక మూడవ వ్యక్తి మూలాన మహాలక్ష్మి వైకుంఠం వదిలి అలిగి వెళ్ళింది. భార్యభర్తల మధ్య మూడవ వ్యక్తి వస్తే గొడవలు వస్తాయని, అప్పుడే బీజం పడింది.. భార్యపై భర్తకి నమ్మకం ఉండాలి.. భర్తపై భార్యకి గౌరవం ఉండాలి.. భార్య అలిగి వెళ్ళిపోతే భర్త ఒక మెట్టు దిగి వెళ్లడంలో తప్పేం లేదు యాభై ఏళ్ళు మేమ్ కలిసున్నా.. ముప్పై ఏళ్ళు నా కోడలు కొడుకు కలిసున్నా.. పాతికేళ్ళు కనకం, కృష్ణమూర్తి కలిసున్నా.. వాళ్ళు ఆ బంధం కి ఇచ్చే విలువ ఆ బ్రహ్మముడికి ఇచ్చే గౌరవమని ఇందిరాదేవి చెప్పగానే.. అందరు క్లాప్స్ కొడతారు. ఆ తర్వాత అపర్ణ మాట్లాడుతూ.. నా భర్త క్షమించ రాణి తప్పు చేసిన అత్తింటిని ఎప్పుడు వదలలేదని అపర్ణ కొన్ని మంచి మాటలు చెప్తుంది. ఆ తర్వాత కనకం మాట్లాడుతూ.. నేను ఏ తప్పు చేసిన నా భర్త నన్ను దూరం పెట్టలేదు.. తను బాధ్యత వహించాడని కనకం వివాహ బంధం గురించి గొప్పగా చెప్తుంది. ఆ తర్వాత అందరూ అలా తమ ఒపీనియన్ చెప్తారు. రాజ్ కూడా కావ్య గురించి చెప్తాడు.

ఆ తర్వాత కావ్య తను బాధగా తన భర్త మనసులో చోటు లేనప్పుడు బంధం గురించి నేనెలా చెప్పగలనని అంటుంది. అప్పుడే పంతులు గారు వచ్చి.. దంపత్య వ్రతానికి ఏర్పాట్లు చేసారా అని అంటాడు. ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు కూర్చొని చేస్తారని కనకం అంటుంది. ఇక్కడ దాంపత్యం బాగోలేదు.. ఇక నేనేం చేస్తానని కావ్య కోపంగా వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ కనకం పక్కకు వచ్చి తన నటన మొదలుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.