English | Telugu

Brahmamudi : గతం మర్చిపోయిన రాజ్.. యామిని అతడిని సొంతం చేసుకుంటుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -665 లో..... అప్పు బయటున్న పోలీస్ ల దగ్గరికి వెళ్లి రాజ్ గురించి అడుగుతుంది. మా అక్కని ఒక్కదాన్నే అడ్మిట్ చేశారు.. బావ ఎక్కడ అని అడుగుతుంది. మీరెవరు మేడమ్ మేమ్ ఇంట్రగేషన్ చేస్తున్నామని అతను అంటాడు. నేను పోలీస్ అంటూ తన ఐడి చూపిస్తుంది అప్పు. అక్కడ ఒక కావ్య గారు మాత్రమే ఉన్నారని అతను అంటాడు. ఇన్సిడెంట్ జరిగిన చోటుకి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి అని వాళ్ళతో చెప్తుంది అప్పు.

మరొక వైపు అపర్ణ వాళ్ళు బాధపడుతుంటే.. కావ్య ఒక్కతే ఉందంటే రాజ్ లేడేమోనని రుద్రాణి అంటుంటే. దాంతో అందరు తనపై విరుచుకుపడతారు. కావ్య అంతా గుర్తుచేసుకొని స్పృహలోకి వస్తుంది. డాక్టర్ అందరిని పిలుస్తాడు. ఆయన ఎక్కడ అంటూ కావ్య అడుగుతుంది. అసలేం జరిగింది నువ్వే చెప్పాలని ఇందిర దేవత అడుగుతుంది. ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటు వెళ్తున్నాం.. కార్ పంచర్ అయింది. తర్వాత లోయలో పడిపోయింది. నాకు స్పృహ లేదు.. ఇక ఏం జరిగిందోనని కావ్య చెప్తుంది. అప్పుడే అప్పు వస్తుంది. ఏమైంది రాజ్ ఆచూకి తెలిసిందా అని అపర్ణ అడుగుతుంది. అప్పు బాధగా అక్కడ బావ కన్పించలేదు.. అక్కడ బావ షర్ట్ మాత్రమే దొరికిందని అప్పు షర్ట్ ఇస్తుంది. అది మా ఆయన షర్ట్ అని కావ్య ఏడుస్తుంది. ఏదైనా దాస్తున్నావా అని అపర్ణ అనగానే.. బావ బాడీని అడవి జంతువులు లాక్కొని పోయి ఉంటాయని అంటున్నారని అప్పు అనగానే అందరు షాక్ అవుతారు. మా ఆయనకేం కాదు అంటూ కావ్య తట్టుకోలేకపోతుంది. మళ్ళీ స్పృహ కోల్పోతుంది.

మరొకవైపు యామిని తన పేరెంట్స్ రాజ్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసి టెన్షన్ పడుతుంటారు. అప్పడే రాజ్ స్పృహలోకి వస్తాడు. రాజ్ దగ్గరికి డాక్టర్ వెళ్తాడు. అసలు నాకు ఏమైందంటూ రాజ్ అడుగుతాడు. ఏం గుర్తు లేదా అని డాక్టర్ అడుగగా.. ఏం గుర్తు లేదని రాజ్ అంటాడు. మీ పేరు చెప్పండి అని డాక్టర్ అనగానే.. నాకు గుర్తు లేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకి వచ్చి అతను గతం మర్చిపోయాడని యామిని వాళ్ళతో చెప్తాడు. నా రాజ్ నా కోసం మళ్ళీ పుట్టాడంటు యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో రాజ్, కావ్య ఒకే హాస్పిటల్ అవడంతో యామిని వాళ్ల అమ్మ, కనకం పక్కపక్కన కూర్చొని ఉంటారు. కాబోయే అల్లుడికి ఆక్సిడెంట్ అయిందని, గతం మర్చిపోయాడని, ఇప్పుడు ఎలా పెళ్లి చేయాలని యామిని తల్లి కనకంతో అంటుంది. తనకే ఇచ్చి చెయ్యండని కనకం అంటుంది. మా అల్లుడు అక్కడ ఉన్నాడు.. చూద్దువు రండి అని కనకాన్ని ఆవిడ తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.