English | Telugu

మొదటివారం నామినేషన్ లో ఎవరున్నారంటే!

బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. హౌస్ మేట్స్ మధ్య సాగిన హీటెడ్ కంటెస్టెంట్స్ మధ్య అరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. వాళ్ళెవరో ఓసారి చూసేద్దాం..

సోనియా నామినేషన్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా మారింది. సోనియా మాట్లాడితే అవతలి వాళ్ళు సరిగ్గా డిఫెండ్ చేయలేకపపోతున్నారు. ఇక కిర్రాక్ సీత హౌస్ లో ఏం జరిగిందని వ్యాలిడ్ పాయింట్లతో నామినేట్ చేసింది. అలాగే అభయ్ నవీన్ కూడా హౌస్ లో ఎలా ఉండాలి.. పర్సనల్ విషయాలు ఇక్కడ అంత అవసరం లేదంటు చెప్పడంతో హౌస్ మేట్స్ క్లాప్స్ కొట్టారు. మణికంఠ తన మొదటి నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు. లాంచింగ్ ఎపిసోడ్ అయిన రోజు తనలో ఫెమినిటీ ఉందంటూ విష్ణుప్రియ చెప్పడం తనకి నచ్చలేదని.. దాని వల్ల తనని బయట అందరూ ట్రోల్ చేసే అవకాశం ఉందంటూ మణికంఠ చెప్పాడు. ఇక ఈ విషయంలో విష్ణుప్రియ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ నిన్ను చెక్ చేయడానికే ఈ థ్రీ డేస్ నీతో క్లోజ్‌గా ఉన్నానంటూ మణికంఠ తన అసలు రంగు బయటపెట్టాడు. "నువ్వు జెన్యూన్ అనుకున్నా కానీ నువ్వు నన్ను చెక్ చేయడానికి వచ్చావ్.. నేను నిన్ను చాలా నమ్మాను " అంటు విష్ణుప్రియ ఏడ్చింది. ఇక తర్వాత తన రెండో నామినేషన్ శేఖర్ బాషాకి వేశాడు మణికంఠ. వీళ్లిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంటే ఎవడికి లేదయ్యా ఫ్లాష్ బ్యాక్.. ఓ వచ్చి ఏడ్చేసి.. దాన్ని నుంచి సింపథీ తెచ్చేసుకొని.. పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నావంటు శేఖర్ బాషా ఫైర్ అయ్యాడు. ఇక వీరిద్దరిలో శేఖర్ బాషాను సేవ్ చేసి విష్ణును నామినేట్ చేసింది యష్మీ.

ఆ తర్వాత పృథ్వీ తన నామినేషన్ ప్రక్రియని మొదలెట్టాడు. బేబక్కను మొదటిగా నామినేట్ చేయగా తర్వాత మణికంఠను నామినేట్ చేశాడు. నాకు పిరికివాళ్లు నచ్చరు.. దేనికైనా ఇలా ఏడ్చే వాళ్లు అసలే నచ్చరు.. నువ్వు సింపథీ గేమ్ ఆడుతున్నావ్.. నువ్వు ఓ నెగెటివ్ పర్సన్ అంటు పృథ్వీ నామినేట్ చేశాడు. ఇక వీరిలో మణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది నైనిక. ఇక హౌసగ లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సోనియా, బేబక్క, ,శేఖర్ బాషా, విష్ణు ప్రియ, పృథ్వీ, మణికంఠ మొత్తంగా ఈ వారం ఆరుగురు నామినేషన్లో ఉన్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.