English | Telugu

Bigg boss 9 Telugu : బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్.. కంటెస్టెంట్స్ కి మైండ్ బ్లాంక్!

బిగ్ బాస్ సీజన్-9 మూడో వారం బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అయిన అనూష రత్నం, షకీబ్, నాగ ప్రశాంత్, దివ్య నిఖిత నలుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్లలో ఒక్కరే హౌస్ లో పర్మినెంట్ గా ఉంటారు. నలుగురు లోపల ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతారు. తమని హౌస్ లో కి వచ్చేందుకు సపోర్ట్ చెయ్యమని ఓటు అప్పీల్ చేసుకుంటారు.

నలుగురు కూడా ఓటు అప్పీల్ చేసుకుంటారు. హౌస్ లో ఏది మిస్ అయిందో అది మేమ్ ఫుల్ ఫీల్ చేస్తామని మాటిస్తారు. ఓటు అప్పీల్ తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిని ఒక్కొక్కరిగా వచ్చి తమ ఫేవరెట్ పర్సన్ ఎవరైతే హౌస్ లోకి రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఓటు చెయ్యాలని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో అందరూ ఓటు వేస్తారు. తాము ఎవరికీ వేశారు అనేది బయటకు చెప్పొద్దని బిగ్ బాస్ చెప్తాడు.

అందరు గార్డెన్ ఏరియాలో ఉంటారు. మీరు సెలక్ట్ చేసుకున్న పర్సన్ ని ఇప్పుడు రివీల్ చేసే టైమ్ వచ్చింది. ఇది రణరంగం కాదు చదరంగం ఎక్కువ మంది ఓటు వేసిన వాళ్ళని కాకుండా చద్దనుకున్న వాళ్ళని హౌస్ లోకి పంపిస్తున్నానని బిగ్ ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. దివ్య నిఖితా ని హౌస్ లోకి ఎంట్రీ చేపిస్తాడు బిగ్ బాస్. అసలు అందరు దివ్యని వద్దనుకున్నారు ఈ ట్విస్ట్ తో కంటెస్టెంట్స్ కి మైండ్ బ్లాంక్ అయింది. మీరందరు నన్ను వద్దనుకున్నారు కదా అని దివ్య అంటుంది. ఇక దివ్యకి నామినేషన్ పాయింట్స్ దొరికినట్లే. దివ్య నిఖిత ఎంట్రీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.