English | Telugu

Bigg Boss 9 Telugu 10th week Voting: పదో వారం ఎలిమినేషన్ గా స్ట్రాంగ్ కంటెస్టెంట్.. డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 పదో వారం ఆసక్తికరంగా సాగింది. కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా కంటెస్టెంట్స్ చిన్నప్పటి ఫోటోలని పంపించాడు బిగ్ బాస్. అయితే ఇందులో పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ గతం విన్న ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ వారం ఇమ్మాన్యుయల్ మినహా పది మంది నామినేషన్లో ఉన్నారు.

నామినేషన్లో ఉన్నవారిలో తనూజకి అత్యధికంగా ఇరవై ఆరు శాతం ఓటింగ్ పడింది. అందుకే తను నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత కళ్యాణ్‌ 24.5 శాతం ఓటింగ్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టాప్‌-3లో భరణి ఉన్నాడు. భరణికి పంతొమ్మిది శాతం ఓటింగ్ పడింది. రీతూకు ఎనిమిది శాతం ఓటింగ్ పడింది. గౌరవ్‌ కి ఏడు శాతం ఓటింగ్ తో ఐదో స్థానంలో ఉన్నాడు. దాదాపు మూడు నుంచి నాలుగు శాతం ఓట్లతో సంజనా, సుమన్‌ శెట్టి ఆరు ఏడు స్థానాల్లో నిలిచారు. ఇక దివ్య, నిఖిల్‌, డీమాన్‌ పవన్‌ లీస్ట్ లో ఉన్నారు. వీరికి మూడు శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు.‌

ఇక తాజాగా శుక్రవారం నాటి ఓటింగ్ బట్టి చూస్తే.. దివ్య, నిఖిల్‌, డీమాన్‌ పవన్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. వీరిలో డీమాన్ పవన్, నిఖిల్‌ ఇంకా డేంజర్‌లో ఉన్నారు.. ఈ వారం నిఖిల్ ఎలిమినేషన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. నిఖిల్ అంత స్ట్రాంగ్‌ కంటెస్టెంట్ గా భావిస్తున్నారు. కానీ అతను ఎప్పుడు ఓటింగ్ లో బాటమ్‌లో ఉంటున్నాడు. పైగా నిఖిల్‌, దివ్యల మధ్య చాలా తక్కువ ఓట్ల డిఫరెన్స్ ఉంది. కాబట్టి వీరిలో ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది బిగ్ బాస్ నిర్ణయిస్తాడు. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.