English | Telugu

బిగ్ బాస్-8 లో ఎనిమిదో వారం ఎలిమినేషన్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకొని ఎనిమిదో వారం ఎండింగ్ కి వచ్చేసింది. శనివారం, ఆదివారం అనగానే ఎలిమినేషన్ గుర్తొస్తుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న క్యూరియాసిటి అందరిలో ఉంది. ఇప్పటికే హౌస్ నుండి ఏడుగురు బయటకు వచ్చేసారు. గత వారం గౌతమ్ లీస్ట్ లో ఉండగా అప్పటికే మణికంఠ నేను వెళ్ళిపోతా అని అనడంతో గౌతమ్ ని ఆపి మణికంఠని పంపించేశారు.

బిగ్ బాస్ లో కొన్ని ఎలిమినేషన్స్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఈ వారం ఆరుగురు నామినేషన్ లో ఉండగా నిఖిల్ ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే లీస్ట్ లో నయని పావని, మెహబూబ్ ఇద్దరు ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేదు. వాళ్ళు ఎనిమిది మంది ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఉన్నారు.. ఓజీ వాళ్ళు ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారం రాయల్స్ నుండి మెహబూబ్ ఎలిమినేషన్ అనేది మొదటిది. ఈ వారం హౌస్ లో మెహబూబ్ ఆటతీరు బానే ఉన్నా బయటకు వచ్చేసాడంటే నామినేషన్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడమే కారణం. మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది తెలియాలంటే సండే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.