English | Telugu

శేఖర్ బాషా కామెడీ నామినేషన్.. మణికంఠకి రాడ్ దింపాడుగా!

బిగ్‌బాస్ సీజన్ 8లో తొలి నామినేషన్ల ప్రక్రియ షురూ అయిపోయింది. వచ్చిన రెండు రోజులకే హౌస్‌లో ఉండటానికి ఎవరు అనర్హులో డిసైడ్ చేసి నామినేట్ చేసేయండి అంటూ ఎప్పటిలానే బిగ్‌బాస్ చెప్పాడు. దీనికి ఎగబడి మరీ నామినేషన్లు వేసి తన్నుకున్నారు.

నాగ మణికంఠ, బేబక్కలని శేఖర్‌ బాషా నామినేట్ చేశాడు. బేబక్కని నామినేట్ చేసి.. కిచెన్ లో వంట గురించి కారణం చెప్పాడు. అది అందరిది. మీరు కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదు.. సీత ఎగ్ బుజ్జి చేసుకోవాలని వచ్చింది కానీ మీరు ఒక్కటే కర్రీ, ఒక్కటే గ్యాస్ అన్నట్టు మాట్లాడారు. రూల్ బుక్ మొత్తం చదివాను.‌. బిగ్ బాస్ అలా ఏం రూల్ పెట్టలేదు.. మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారో నాకు తెలియదు.‌ కానీ అంత స్ట్రిక్ట్ గా ఉండటం కరెక్ట్ కాదు.. అలా చేయడం నాకు నచ్చలేదు.. అందుకే నామినేట్ చేస్తున్నానని బేబక్కని నామినేట్ చేశాడు శేఖర్ బాషా. ఆ తర్వాత నాగ మణికంఠను నామినేట్ చేశాడు శేఖర్ బాషా. చీఫ్‌లుగా వాళ్లు ఫిట్ కాదంటూ మణికంఠ ఓపెన్‌గా చెప్పడం తనకి నచ్చలేదంటూ కారణం చెప్పాడు. దానికి నాగ మణికంఠ బదులిస్తూ.‌‌. మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది ఒకేనా అని అనగానే.. ఒకేనా అంటే ఒకే కాదు అని శేఖర్ బాషా అనేసాడు. దీంతో అందరు ఒక్కసారిగా నవ్వేసారు.

శేఖర్ బాషా నామినేట్ చేసిన మణికంఠ, బేబక్కల్లో.. మణికంఠను సెలక్ట్ చేసి బేబక్కను సేవ్ చేసింది చీఫ్ నైనిక. ఎందుకంటే అది కిచెన్ ప్రాబ్లమ్ .. మాతో బేబక్క డిస్కస్ చేసింది. అందుకే తనని సేవ్ చేశానంటూ నైనిక చెప్పేసింది.‌ ఇక మధ్యమధ్యలో శేఖర్ బాషా నాన్ సింక్ పంచులు నవ్విస్తున్నాయి.‌ ఇక శేఖర్ వేసిన అర్థం కానీ గజిబిజి ప్రశ్నలని మీమ్స్, ట్రోల్స్ లో వాడేస్తున్నారు. దీంతో హౌస్ లో యాక్టివ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో శేఖర్ బాషా ఒకడిగా నిలిచాడు. మరి మీకు ఏ కంటెస్టెంట్స్ యాక్టివ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.