English | Telugu

బాబా భాస్క‌ర్ ఎంట్రీ.. నువ్వు బిగ్ బాసా..? అరియానా ఫైర్‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి బాబా భాస్క‌ర్ మాసీవ్ ఎంట్రీ ఇచ్చేశాడు. వ‌చ్చీ రాగానే కంటెస్టెంట్ ల‌ని స‌ర్ ప్రైజ్ పెరుతో టెన్ష‌న్ పెట్టాడు. గెస్ట్ లా వ‌చ్చాడ‌ని భావించిన ఇంటి స‌భ్యుల‌కు తాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చానంటూ దిమ్మ‌దిరిగే షాకిచ్చాడు. ఎంట్రీ ఇస్తూనే గేటు దూకి మ‌రీ ర‌చ్చ ర‌చ్చ చేశాడు. ఇదేంటీ ఇలా వ‌చ్చాడ‌ని అంతా షాక్ కు గురైపోయారు. ఇత‌నేంటీ ఇలా ఎంట్రీ ఇచ్చాడ‌ని అంతా విస్తూ పోయారు. అయితే వారిని ఆట ఆడుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న బాబా భాస్క‌ర్ త‌న‌కు బిగ్ బాస్ సూప‌ర్ ప‌వర్ ఇచ్చాడ‌ని, వీర లెవెల్లో బిల్డ‌ప్ ఇచ్చేశాడు.

అప్ప‌టి వ‌ర‌కు వెలిగిపోయిన ఇంటి స‌భ్యులు ముఖాలు ఒక్క‌సారిగా మాడిపోయాయి. ఏం జ‌రుగుతోంది? .. బాబా భాస్క‌ర్ ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? ... ఏంటీ అత‌ని గొప్ప అనే విధంగా అరియానా ఫీలైపోయింది. 'నామినేష‌న్స్ లో వున్న ఆరుగురు రండి' అంటూ ఏదో చేయ‌బోతున్న‌ట్టుగా బిల్డ‌ప్ ఇచ్చాడు బాబా భాస్క‌ర్. 'ఏకాభిప్రాయం తీసుకుని చెప్పండి' అని అన‌గానే అరియానా అందుకుసిద్ధ‌మైంది. ఇంత‌లో టైమ్ వేస్ట‌వుతోంద‌ని మ‌రీ రెచ్చిపోయాడు బాబా భాస్క‌ర్‌. 'మీరు అలా అంటే ఏమీ చేయ‌లేము' అని అరియానా అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించింది.

'అయినా మీరెవ‌రు అడ‌గ‌డానికి?.. మీకు ఎందుకు చెప్పాలి?.. అలా అని బిగ్ బాస్ వాయిస్ వినిపించ‌మ‌ని చెప్పండి' అని గ‌ట్టిగానే నిల‌దీసింది అరియానా.. 'ఈయ‌న బిగ్ బాస్ రా చెప్ప‌డానికి.. గెస్ట్ గా వ‌స్తే ఏది చెప్ప‌మంటే అది చెప్పాలా?' అంటూ చిందులేసింది. వెంటనే 'స‌ర్‌ప్రైజ్‌ అని చెబుతున్నాను క‌దా?' అన్నాడు బాబా భాస్క‌ర్‌. ఇదంతా సీరియ‌స్ ట‌ర్న్ తీసుకుంటోంద‌ని గ‌మ‌నించిన బాబా భాస్క‌ర్ త‌నేంటో చెప్పేశాడు. త‌న వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌస్ లోకి పంపించార‌ని చెప్పేశాడు. 'రెండు రోజుల్లో మీతో క‌లిసి పోతాను `అంటూ షాకిచ్చాడు. దీంతో హౌస్ లో వున్న వాళ్ల లెక్క‌ల‌న్నీ ఒక్క‌సారిగా మారిపోయాయి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.