English | Telugu

Ayesha Zeenath Wildcard Entry: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అయేషా.. తనకిచ్చిన పవర్ ఏంటంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటి ఎపిసోడ్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలతో పవర్ ప్యాక్ గా మారింది. ఒక్కో కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తుంటే ఇప్పటివరకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి చెమటలు పడుతున్నాయి. అంతలా భయపెట్టిన వారిలో అయేషా జీనత్ ఒకరు.

సీరియల్ హీరోయిన్ గా, మోడల్ గా చేసిన అయేషా జీనత్ వైల్‌కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోకి అయిదవ వైల్డ్‌కార్డ్‌గా అయేషా వచ్చింది. సూపర్ పర్ఫామెన్స్‌తో హౌస్‌లోకి వచ్చిన అయేషాని చూసి నాగార్జున అయితే ఫిదా అయిపోయాడు. ముఖ్యంగా ఆమె ఎనర్జీ మాములుగా లేదు. తెలుగు కూడా చాలాా బాగా మాట్లాడుతుంది. అయేషా నువ్వు రౌడీ బేబీ అంట కదా అని నాగార్జున అడిగాడు. అవును సర్ చాలా అంటూ అయేషా చెప్పింది. ఇక మరి ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నావ్.. చాలా అందంగా ఉన్నావ్.. మరి ప్రపోజల్స్, లవ్ సంగతేంటని నాగర్జున అడుగగా.. చాలా సార్లు ప్రేమలో పడ్డాను సర్.. ముఖ్యంగా తమిళ్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు అని అంది. నాకు బయట ఒక లవ్ ఉండేది. తన గురించి ఆలోచిస్తూ నేను గేమ్స్ సరిగ్గా ఆడలేకపోయాను.. మొత్తం 65 రోజులు హౌస్‌లో ఉన్నా, తీరా బయటికి వచ్చేసరికి వాడు మరొక అమ్మాయితో సెట్ అయిపోయాడు. అప్పటి నుంచి ప్రేమకి దూరంగా ఉన్నాను ఈసారి కప్పే లక్ష్యంగా హౌస్‌లోకి వెళ్లబోతున్నానంటూ అయేషా చెప్పింది.

ఇక ప్రతీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీకి ఇచ్చినట్లే అయేషాకి ఒక పవర్ ఇచ్చాడు. దాని పేరే నామినేషన్ పవర్.. దీని కోసం ఆమెకి గ్రీన్ స్టోన్ ఇచ్చాడు నాగార్జున. ఈ పవర్ సాయంతో నామినేషన్ జరిగే ప్రక్రియని మార్చొచ్చు.. అది ఎలా అనేది బిగ్‌బాస్ చెప్తారంటూ నాగార్జున చెప్పాడు. ఇక అయేషా లోపలికి వెళ్లే ముందు తనకి నాగార్జున చిన్న టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో ఎవరో ఒక అబ్బాయికి హార్ట్ సింబల్ ఇవ్వాలన్నాడు. అయేషా ఆ హార్ట్ సింబల్‌ని తీసుకెళ్ళి ఇమ్మాన్యుయల్ కి ఇచ్చింది. ఇక లోపలికి వెళ్ళిన అయేషా అందరిని పరిచయం చేసుకుంది. ఇక హౌస్ లోకి ఆరుగురు వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.