English | Telugu

సుధా రాజ్ పుత్ గుట్టు తెలుసుకున్న ఆర్య‌వ‌ర్థ‌న్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని నెల‌లుగా విజ‌య‌వంతంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మ‌రాఠీ సీరియల్ `తుల ఫ‌ఠేరే` ఆధారంగా ఈ ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. `బొమ్మ‌ల‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వమోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, జ‌య‌ల‌లిత, అనూషా సంతోష్‌, రాధాకృష్ణ‌, క‌ర‌ణ్‌, సందీప్‌, జ్యోతిరెడ్డి, మ‌ధుశ్రీ న‌టించారు.

ర‌ఘుప‌తి త‌ను మీడియాకు ఇచ్చిన సీడీ ఎక్క‌డ త‌న మెడ‌కు చుట్టుకుంటుందో న‌ని తాను ఆ త‌ప్పు చేయ‌లేద‌ని సుధా రాజ్ పుత్ ఇదంతా చేస్తోంద‌ని ఆర్య వ‌ర్ధ‌న్ కు చెప్పాల‌ని ఆర్య ఇంటికి బ‌య‌లుదేర‌తాడు. మార్గ‌మ‌ధ్యంలో కొబ్బ‌రి బోండాం తాగ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే రాగ‌సుధ మ‌నిషి వ‌శిష్ట అత‌నికి కొబ్బ‌రినీళ్ల బాటిల్ లో ఏదో మందు క‌ల‌పి ఇస్తాడు. అది తాగుతూ ఆర్య ఇంటికి చేరుకున్న ర‌ఘుప‌తికి మాట ప‌డిపోతుంది. ఎంత ప్ర‌య‌త్నించినా ఆర్య వ‌ర్ధ‌న్ ముందు సుధా రాజ్ పుత్ బండారం బ‌య‌ట‌పెట్టాల‌ని ప్ర‌య‌త్నించినా ఫ‌లితం వుండ‌దు.

త‌ను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని పెన్ను పేప‌ర్ ఇస్తే రాస్తాన‌ని ర‌ఘుప‌తి సైగ చేయ‌డంతో అందుకు అను రెడీ అవుతుంది. కానీ సుధా రాజ్ పుత్ వేశంలో వున్న రాగ‌సుధ అడ్డుత‌గిలి ర‌ఘుప‌తి ఏం చెబుతున్నాడో త‌న‌కు తెలుసు అని చెప్పి మాట మారుస్తుంది. అక్క‌డి నుంచి ర‌ఘుప‌తి వెళ్లిపోయేలా చేస్తుంది. క‌ట్ చేస్తే.. ఆర్య‌కు సంబంధించిన సీడీని మార్చి మీడియా ఛాన‌ల్ వాళ్లు బ్రేకింగ్ న్యూస్ కింద న్యూసెన్స్ ని క్రియేట్ చేయ‌బోతున్నార‌ని జెండే కు తెలుస్తుంది. ఈ విష‌యాన్ని ఆర్య‌కు వివ‌రించి స‌ద‌రు ఛాన‌ల్ లో న్యూస్ టెలీకాస్ట్ కాకుండా చేస్తారు.

ఆ త‌రువాత స‌ద‌రు ఛాన‌ల్ వారి నుంచి సీడీని మ‌రొక‌రు ఎత్తుకెళ్లార‌ని తెలియ‌డంతో జెండే మిగ‌తా ఛాన‌ల్ ల‌ని హెచ్చిరించే ప‌నిలో వుంటాడు. ఇదే స‌మ‌యంలో సుధా రాజ్ పుతే రాగ‌సుధ అనే విష‌యం త‌న‌కు తెలిసింద‌ని ఆర్య వ‌ర్ధ‌న్ చెప్ప‌డం తో జెండే షాక్ గుర‌వుతాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. అనుని రాగ‌సుధ పోలీస్టేష‌న్ కి ఎందుకు ర‌మ్మంది?.. త‌న‌ని అడ్డు పెట్టుకుని ఏం చేయ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.