English | Telugu

నెటిజ‌న్ ప్ర‌శ్న‌కి యానీ ఆన్స‌ర్ అదిరింది

బిగ్‌బాస్ సీజ‌న్ 5 షో ముగిసినా దాని వ‌ల్ల కంటెస్టెంట్ ల చుట్టూ ఏర్ప‌డిన వివాదాలు ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఇటీవ‌ల ష‌న్ను, దీప్తిలు బ్రేక‌ప్ చెప్పుకోవ‌డం... సిరి వారి బ్రేక‌ప్ కి నేను కార‌ణం కాదంటూ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం తెలిసిందే. ఇదిలా వుంటే బిగ్‌బాస్ హౌస్ లో త‌నదైన స్టైల్లో డ్యాన్యుల‌తో ఇత‌ర కంటెస్టెంట్ ల‌పై విరుచుకుప‌డిన యానీ మాస్ట‌ర్ తాజాగా వార్త‌ల్లో నిలిచింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌ని ట్రోల్ చేస్తున్న వారికి అదిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చింది.

బిగ్‌బాస్ హౌస్‌లో స‌న్నీ, మాన‌స్‌, కాజ‌ల్ ల‌తో యానీ మాస్ట‌ర్ గొడ‌వ‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా కాజ‌ల్ తో యానీ ప్ర‌తీ సారి ఏదో ఒక విధంగా గొడ‌వ‌కు దిగి నాగిన్ అంటూ ఎద్దేవా చేయ‌డం, అరుపులు కేక‌ల‌తో త‌న‌పైకి వెళ్ల‌డం తెలిసిందే. హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక ఇవ‌న్నీ వ‌దిలేసిన కంటెస్టెంట్ లు వీకెండ్ స‌మ‌యాల్లో క‌లిసి పార్టీలు చేసుకుంటున్నారు. కానీ కాజ‌ల్‌, స‌న్నీ మాత్రం పెద్ద‌గా ఏ పార్టీల్లో క‌నిపించ‌డం లేదు. ఇక యానీ మాస్ట‌ర్ మాత్రం పార్టీల్లో నే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ య‌మ యాక్టీవ్ గా వుంటోంది.

Also read: వంట‌ల‌క్క మ‌రిదిని బుట్ట‌లో వేసిన మోనిత‌

అయితే యానీ మాస్ట‌ర్ ని ఫాలో అవుతున్న ఓ నెటిజ‌న్ మీకు స‌న్నీ, మాన‌స్‌, కాజ‌ల్ గ్రూప్ అంటే ఎందుకంత ద్వేష‌మ‌ని, వారితో మీరు క‌లిస్తే చూడాల‌ని వుంద‌ని అడిగాడు. ఈ ప్ర‌శ్న‌కు స్ట‌న్నింగ్ రిప్లై ఇచ్చింది యానీ మాస్ట‌ర్. `నాకు ఎవ్వ‌రి మీద ద్వేషం లేదు. జీవితం చాలా చిన్న‌ది.. వాళ్లు మంచి స్నేహితులు. క‌ష్టాల్లో ఒక‌రికొక‌రు తోడుగా వున్నారు. నాకూ వాళ్ల‌తో క‌ల‌వాల‌ని వుంది కానీ కాస్త స‌మ‌యం ప‌డుతుంది. నాకు అంద‌రితో క‌ల‌వాల‌ని వుంది. కానీ అంద‌రూ బిజీగా వున్నారు అందుకే క‌ల‌వ‌లేక‌పోతున్నాం` అని చెప్పుకొచ్చింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.