English | Telugu

మూగజీవాలకు ఒక గుడ్ న్యూస్ చెప్పిన రష్మీ!


యాంకర్ గా రష్మీ ఇప్పుడు బుల్లితెర మీద ఒక స్టార్. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తూ వారంలో మూడు రోజుల పాటు ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. మంచి సినిమా ఆఫర్స్ వస్తే అందులో కూడా తన టాలెంట్ చూపిస్తూ ఫుల్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ అన్న తేడా లేకుండా అవకాశాలను వినియోగించుకుంటోంది.

ఎంతో హ్యాపీ గా ఉండే రష్మీ తన మనసులో మూగ జీవాలంటే ఆవేదనతో ఉంటూనే ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన ఫొటోస్ కన్నా ఇలా మూగజీవాలు పడుతున్న బాధల్ని ఎక్కువగా పోస్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ని కూడా షేర్ చేసింది. అది ఏంటంటే ఆకాశ ఎయిర్ లైన్స్ వాళ్ళు ప్యాసెంజర్స్ తో పాటు వాళ్ళ పెట్స్ కి కూడా త్వరలోనే అనుమతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బుకింగ్స్ అక్టోబర్ 15 నుంచి మొదలు కాబోతున్నాయి. ఎప్పటికీ ఇదొక గుడ్ న్యూస్ అంటూ తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసింది. రష్మీ యానిమల్ లవర్. వాటికి హాని జరిగితే ఆమె మనసు భరించలేదు.

మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకునేలా కూడా సంబంధిత అధికారులకు ఆమె ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటుంది. రీసెంట్ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ''జంతువులకు సాయం చేసే పరిస్థితి అందరికీ ఉండదు. కానీ వాటికి హాని చేయకూడదని అనే విషయం కూడా అందరికీ తెలుసు" అని చెప్పింది. వాటికి హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ వాటిని హింసించే రైట్ ఎవరికీ లేదు అంటూ ఘాటుగా తిట్టింది ఈ పోస్ట్ ద్వారా.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.