English | Telugu

ఆదిత్య ఓంకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చిన బిగ్ బాస్.. ఎంతంటే!

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడమంటే కంటెస్టెంట్స్ కి కాసుల పంట అందినట్టే.. హౌస్ లో ఎన్ని వారాలుంటే అంత ఖజానా జేబులో వేసుకోవచ్చు.

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే అయిదు వారాలు పూర్తి చేసుకుంది. అందులో మొదటగా బెజవాడ బేబక్క, రెండో కంటెస్టెంట్ గా శేఖర్ బాషా, మూడో కంటెస్టెంట్ గా అభయ్ నవీన్, నాల్గవ కంటెస్టెంట్ గా సోనియా ఆకుల ఎలిమినేషన్ అయ్యారు. ఇక అయిదో వారం మిస్టర్ కూల్ ' ఆదిత్య ఓం' (Aditya Om) ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ఎవరికి సపోర్ట్ చేయకుండా అందరికి నచ్చేలా ఉంటూ.. డీసెంట్ కంటెస్టెంట్ అని ముద్ర వేసుకున్న మంచోడు ఆదిత్య ఓం. అయితే హౌస్ లో కన్నడ కుట్టీలు యష్మీ, ప్రేరణ చేసిన నామినేషన్ అతని పెద్ద మైనస్ గా మారింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ గా బయటకొచ్చాడు. ఇక హౌస్ లో అతనికి జీరో హేటర్స్ ఉన్నారు.

ఆదిత్య ఓం మొత్తం నాలుగున్నర వారాలపాటు హౌస్ లో ఉన్నాడు. ఆదిత్య ఓం కి బిగ్ బాస్ నిర్వాహకులు బాగానే ఆఫర్ చేశారట. వారానికి రూ.3 లక్షల చొప్పున నాలుగున్నర వారాలకు గానూ దాదాపు రూ.14 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.