English | Telugu

'అంకుల్' అని పిలుస్తూ బాడీ షేమింగ్ చేస్తున్నారా!?

నిన్నటి వరకు ట్విట్టర్ లో 'ఆంటీ' వివాదం రచ్చ చేసింది. ఇప్పుడు కొత్తగా 'అంకుల్' వివాదం తెర మీదకు వచ్చింది. దీనికి కారణం నటుడు బ్రహ్మాజీ. ఆయన ఇటీవల ఒక వెరైటీ సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "వాట్స్ హాపెనింగ్ " అంటూ ఒక క్వశ్చన్ కూడా రిలేటెడ్ గా పెట్టారు. దీంతో ఒక నెటిజన్ "ఏం లేదు అంకుల్" అంటూ రిప్లై ఇచ్చాడు. అసలే బ్రహ్మాజీకి కోపం చాలా తక్కువ. కానీ ఈ రిప్లైకి కొంచెం కోపం వచ్చినట్టే ఉంది.

"అంకుల్ ఏంట్రా అంకుల్... కేసు వేస్తా.. నా ఏజ్ ని, నన్ను చూసి బాడీ షేమింగ్ చేస్తున్నావా?" అంటూ సెటైర్ వేసాడు. అలాగే ఆ కామెంట్ పక్కన ఒక స్మైల్‌ ఎమోజి పెట్టేసరికి ఇది సరదాగా పెట్టిన పోస్ట్ అని అర్థమౌతోంది. ఇటీవల అనసూయని ఆంటీ అన్నందుకు కేసు పెట్టింది. ఆ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.

ఐతే ఆమెను ఆంటీ అన్నందుకు మాత్రమే కేసు వేయలేదు అన్నా!! ఆంటీ అంటూ వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడినందుకు కేసు వేస్తానని అన్నారు..! తోటి కళాకారులకు సహకారం ఇవ్వకుండా కామెడీ చేయడం ఏంటి బ్రహ్మాజీ అన్నా మీరు!!? అంటూ మిగతా నెటిజన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఒక వేదిక మీద"అలాగే మా తాతగారు బ్రహ్మాజీ" గారు అన్న డైలాగ్ ని పోస్ట్ చేశారు. ఆంటీ వివాదమే ఇంకా చల్లారలేదు, ఇప్పుడు కొత్త‌గా అంకుల్ అన్నందుకు బ్రహ్మాజీ ఫైర్ అవుతున్నారు. ఈ అంకుల్ మాట ఎంతో దూరం వెళ్తుందో వేచి చూడాలి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.