English | Telugu

వాళ్ళ స్టెప్పులు మాములుగా లేవు.. అందరూ కలిస్తే అంతేమరి

మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక గొప్ప అదృష్టం ఏమిటి అంటే టాలెంట్ ఉంటే చాలు హీరో, హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా సపోర్టింగ్ రోల్స్ తో ఫుల్ పాపులర్ అవ్వొచ్చు..మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అలా ఎంతో మంది హీరోయిన్స్ అవ్వాలని వచ్చి క్యారక్టర్ ఆర్టిస్టులు ఐన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఎన్నో మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో చేసిన నటీమణులు అంతా కలుసుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు.

టాలీవుడ్ లో మనకు ఎక్కువగా అమ్మ, అత్తా, వదిన, అక్కా, చెల్లి లాంటి క్యారెక్టర్స్ లో నటించిన సురేఖా వాణి, హేమ, ప్రగతి, పవిత్రా లోకేష్ తో పాటు చాలామంది గుర్తొస్తారు. అప్పటి, ఇప్పటి మూవీస్ సక్సెస్ లో వీళ్లంతా కీ రోల్ ప్లే చేస్తున్నారు. హీరోయిన్ కి మించి నటిస్తున్నారు. తనకు అవకాశాలు రావడం లేదు అంటూ ఈమధ్య కాలంలో బాధపడిన సురేఖా వాణి తన అందాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటుంది.హీరోయిన్ రేంజ్ లో అందంగా ఉండేసరికి ఈమెకు ఎక్కువగా అక్క పాత్రలు వస్తున్నాయి.

శైలజ ప్రియా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. అందంగా కనిపిస్తూ తన నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇలా ఒకప్పటి సపోర్టింగ్ రోల్స్ లో నటించి ఇప్పటికీ నటిస్తున్న వాళ్లంతా కూడా సరదాగా సురేఖావాణి ఇంట్లో కలుసుకున్నారు. 12 మంది సీనియర్ నటీమణులు ఒక్కచోటకు చేరారు. ఫుల్ గా ఆడి పాడారు. సురేఖావాణి ఆ ఫొటోస్ ని, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. "రా రా రక్కమ్మ" సాంగ్ కి అందరూ కలిసి స్టెప్స్ ఇరగదీసారు. ఇక నెటిజన్స్ రెచ్చిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు. "ప్రగతి, సుధా, పవిత్ర లోకేష్ ఆంటీలు ఎక్కడ ?" " వీళ్లు లేని సినిమా వుండదు. వీళ్ళు చేయని పాత్రలు కూడా లేవు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వీళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు " అంటూ కామెంట్స్ పెట్టారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.