English | Telugu

హీరోగా దేవి శ్రీ ప్రసాద్...ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా!

జయమ్ము నిశ్చయమ్మురా నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. దీనికి డిఎస్పీ వచ్చాడు. రాగానే జగపతి బాబు ఇంటరెస్టింగ్ ప్రశ్నలు అడిగారు. "గోవాలో నేను కాండిల్ లైట్ డిన్నర్ ఫోన్ ల మీద ఫోన్ లు అన్ని ఫోన్ లా" అని జగపతి బాబు అడిగేసరికి "తర్వాత మాట్లాడుకుందాం సర్" అన్నాడు డిఎస్పీ. "ఆ మాయ ఏంటి ఆ మాయ ఎవరు" అని జగ్గు భాయ్ అడిగేసరికి" "మాయ ఓ మాయ" అంటూ డిఎస్పీ పాట పాడాడు. "ఎన్ని లవ్ స్టోరీస్ ఉంటే అన్ని బ్రేకప్స్ ఉంటాయి కదా" అని జగపతి బాబు అన్నారు. "లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ తెలిసీ తిలేకుండా చేసేశాం సర్" అని చెప్పాడు డిఎస్పీ. "మై లవ్ ఈజ్ గాన్" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ ప్లే అయ్యింది. తర్వాత కళ్లద్దాలు తీసేసాడు డిఎస్పీ. "కళ్ళజోడు తీసెసావుగా ఇక ఎక్స్ప్రెషన్స్ చక్కగా కనబడిపోతాయి" అన్నారు జగపతి బాబు.

లవ్ ట్రాక్ లో సుధీర్...స్మైల్ తో పడేశాడుగా!

ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వారం ఈ ఎపిసోడ్ కి "రౌడీ గర్ల్స్ వెర్సెస్  రౌడీ బాయ్స్ " కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇక ఢీ డాన్సర్ పండు ఐతే సై మూవీలో భిక్షు యాదవ్ గెటప్ లో ముక్కుకు రింగు పంచెతో వచ్చాడు. ఇక అష్షు రెడ్డి వచ్చి భిక్షు యాదవ్ అనేసరికి "గట్టిగా కొడితే బిక్కు బిక్కు మంటూ ఏడుస్తాడు వీడు భిక్షు యాదవా" అంటూ సుధీర్ పండు మీద సెటైర్ వేసాడు. తర్వాత కావ్య బ్లాక్ శారీలో క్రాక్ మూవీలో జయమ్మ గెటప్ లో వచ్చింది. "జయమ్మ నీ గుండెల్లో కత్తి దింపుతా" అంటూ చేతిలో కత్తి తీసుకుని వచ్చి సుధీర్ ని బెదిరించింది. "నీకే ప్రమాదం" అన్నాడు సుధీర్. ఏ అని కావ్య అడిగేసరికి "అక్కడ ఉన్నది మీరే కదా మరి" అంటూ రొమాంటిక్ డైలాగ్ చెప్పేసరికి కావ్య నవ్వు ముఖం పెట్టింది. ఇక రియాజ్ ఐతే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో అమ్రిష్ పూరి గెటప్ వేసుకుని వచ్చాడు. ఇక ఫైనల్ లో సౌమ్యశారదా నరసింహ మూవీలో రమ్యకృష్ణ అలియాస్ నీలాంబరి గెటప్ లో బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చింది.

ఫేక్ అకౌంట్స్ నడుపుతున్న భాస్కర్

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో ఫుల్ కామెడీగా ఉంది. శాంతి స్వరూప్ పట్టు చీర కట్టుకుని వచ్చేసరికి రాంప్రసాద్ వెంటనే "శారీ మాత్రం చాలా బాగుందమ్మా" అన్నాడు. దాంతో "మా మావయ్య ఆయన చేతుల మీద పట్టు చీర కొట్టాడు. ఈ చీర కోసం 100  పట్టు పురుగులు చచ్చాయి" అన్నాడు. దాంతో దొరబాబు "ఈ పురుగు కోసం 100 పురుగులు చచ్చాయా" అంటూ శాంతి స్వరూప్ మీద సెటైర్ వేసాడు. ఇక ఫైనల్ లో బులెట్ భాస్కర్, ఫైమా స్కిట్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. "ఏవండీ ఈ రోజు నైట్ కి ములక్కాడ చారు చేయమంటారా, ములక్కాయ పులుసా " అని అడిగింది. "వద్దు, వద్దు, వద్దు" అన్నాడు భాస్కర్.

Bigg Boss 9 Telugu : నిఖిల్ నామినేషన్ తో తనూజ షాక్.. దివ్య పాపం!

బిగ్ బాస్ సీజన్-9 ఎనిమిదో వారానికి చేరుకుంది.  సోమవారం మొదలైన నామినేషన్ ప్రక్రియ నిన్నటివరకు ఆసక్తికరంగా సాగింది.  నామినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్  భరణి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  తనని చూసి దివ్య పరుగెత్తుకుంటూ వెళ్లి భరణిని హగ్ చేసుకుంటుంది. భరణిని చూసి తనూజ ఎమోషనల్ అవుతుంది. కట్టప్పా వచ్చాను..  అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచావు.. మహేంద్ర బాహుబలి వచ్చాడని ఇమ్మాన్యుయల్ తో భరణి అంటాడు. భరణి తన మొదటి నామినేషన్ సంజనని చేస్తాడు. మీరు మాట్లాడే మాటలు ఇతరులని హర్ట్ చేసే విధంగా ఉన్నాయి. హరీష్ ఒక మాట ఏదో అన్నందుకు బాడీ షేమింగ్ అన్నారు.. మరి మీరు చేస్తోంది ఏంటి? కెప్టెన్ ని ఇష్టం వచ్చినట్లు మాటలు అనొచ్చా అని భరణి తన పాయింట్స్ అన్ని క్లియర్ గా చెప్పాడు.

Jayam serial : మార్టిన్ కి నిజం చెప్పిన వీరు.. గంగ మాటలని శకుంతల నమ్ముతుందా!

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -96 లో.....రుద్రని ఓడించాలని మార్టిన్ తో పారు అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది. మరొకవైపు రుద్రని పోటీలో చంపేస్తే నీకు రెండు కోట్లు ఇస్తానని మార్టిన్ తో డీల్ కుదుర్చుకుంటాడు వీరు. రుద్ర, మార్టిన్ పోటీపడుతారు మొదటి రౌండ్ కి రుద్ర విన్ అవుతాడు‌. మీ తమ్ముడిని చంపింది ఎవరో నాకు తెలుసు నువ్వు ఓడిపోతే నిజం చెప్తానని మార్టిన్ అనగానే రుద్ర సెకండ్ రౌండ్ కి ఓడిపోతాడు. ఆ తర్వాత వీరు చెప్పినట్లు రుద్రని మార్టిన్ ని చంపాలని ట్రై చేస్తాడు. దాంతో ముందే పసిగట్టిన రుద్ర తన కాలు విరగ్గొడతాడు.

Karthika Deepam2 : గుడికి వెళ్ళిన సుమిత్ర.. దశరథ్ ని చూసి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -500 లో......పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటారు. గెలవాలంటే మనం అనుకున్నది చెయ్యాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. మరుసటి రోజు శివన్నారాయణ హాల్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే కార్తీక్ వస్తాడు. నేను బయటకు వెళ్తున్నాను నాన్న ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యండి అని అంటాడు. వీడు ఖచ్చితంగా గుడికి వెళ్తున్నాడని కార్తీక్, శివన్నారాయణ అనుకుంటారు. సరే వెళ్ళు కానీ కార్తీక్ ని కూడా తీసుకొని వెళ్ళమని శివన్నారాయణ అంటాడు. కార్తీక్, దశరథ్ ఇద్దరు బయల్దేర్తారు.

కన్నీళ్లు పెట్టుకున్న భావన.. భాను డాన్స్ లో డెప్త్ కాదు విడ్త్ కూడా ఉంది

కార్తీక మాసం స్పెషల్ గా "కార్తీక వైభోగమే" పేరుతో ఈ ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ కార్తీక పౌర్ణమిని స్పెషల్ గా చేసుకోబోతున్నాం అలాగే అక్కాచెల్లెళ్ల సెలబ్రేషన్ కూడా చేసుకోబోతున్నాం. ఈ షోకి శ్రీవాణి తన అక్కని తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసింది. ఇక ఢీ డాన్సర్ మహేశ్వరీ ఐతే ఆ నటరాజుడు కలిపినా అక్కచెల్లెళ్ళం మేము అని చెప్పింది. ఇక అందరూ శివలింగానికి క్షీరాభిషేకం చేసి ఆ నందీశ్వరుడి చెవిలో ఎం చెప్తే ఆ కోరిక నెరవేరుతుందని అందరూ వారి వారి కోరికలు కోరుకున్నారు. ఇక భావన ఐతే కన్నీళ్లు పెట్టుకుంది. "ఎందుకు అని రష్మీ అడిగింది" ." నాకు ఒక సొంత అక్క ఉంది.

లెజెండ్ ..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాములుగా లేపలేదు!

జయమ్ము నిశ్చయమ్మురా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ దేవిశ్రీప్రసాద్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. "లెజెండ్ ..నువ్వు నాకిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాములుగా లేపలేదు నువ్వు నన్ను." అన్నారు జగ్గు భాయ్. థ్యాంక్యూ సర్ అన్నాడు డిఎస్పీ. "నాన్న గారు రాసిన పాట తెలీదు కానీ గర్ల్ ఫ్రెండ్ కి నువ్వు రాసిన పాట మాత్రం బాగా తెలుసు" అని జగ్గూభాయ్ అనేసరికి "ఎం పాట సర్ అది" అంటూ డిఎస్పీ రివర్స్ లో ఆయన్నే అడిగారు. వెంటనే "నిన్ను చూడగానే చిట్టి గుండె" సాంగ్ ప్లే అయ్యింది బ్యాక్ గ్రౌండ్ లో. "రోడ్డు మీద అనుకోకుండా వచ్చిన పాట సర్ ఇది. ఈ లైన్ పడేసరికి ఇటు నుంచి ఇంకో అమ్మాయి వెళ్తోంది.  సరదాగా కళ్యాణ్ గారిని పిలిచి ఈ పాటను వినిపిద్దామా అని అంటే వీడు ఆరడుగుల బుల్లెట్టు అని పాడి అక్కడ ఒక కెమెరా స్టాండ్ ఉంది.

ఇండస్ట్రీకి కొత్త యాంకర్..భయంతో శ్రీముఖి

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. అందమైన అమ్మాయిలతో జరుపుకునే కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ గా దీన్ని టెలికాస్ట్ చేయబోతున్నారు. పండగ రోజు వీళ్ళ కట్టు, బొట్టు అందం చూస్తుంటే కొలికేయాలనిపిస్తోంది, కొలికేయాలనిపిస్తోంది అంటూ చెప్పింది శ్రీముఖి. ఇక ఈ షోకి సుహాసిని ఫుల్ బుట్టబొమ్మలా రెడీ అయ్యి వచ్చింది. "పండగ రోజు నువ్వు మీ ఆయన ఎం చేస్తారో చెప్పు" అంటూ శ్రీముఖి అడిగింది. దానికి అవినాష్ ఆన్సర్ ఇచ్చాడు. "పొద్దున్న లేవగానే డజన్ రైస్ పెడుతుంది." అనేసరికి శ్రీముఖి వెంటనే "లీటర్ కర్రీ వండుద్ది" అనేసరికి సుహాసిని షాకైనట్టుగా ఒక ఫేస్ పెట్టింది. ఇక కార్తీక దీపం 2  లో నటిస్తున్న గాయత్రి కూడా వచ్చింది. వెంటనే శ్రీముఖి ఆమె దగ్గరకు వెళ్లి "నీకు ఎలాంటి హజ్బెండ్ కావాలి చెప్పు" అని అడిగింది. "శ్రీముఖికి ఎలాంటి హజ్బెండ్ ఐతే వస్తాడో నాకు అలాంటి హజ్బెండ్ కావాలి " అని చెప్పింది. దాంతో శ్రీముఖి భయపడిపోయి "ఓరి నాయనో ఇది నా మొగుడి మీద కన్నేసేటట్టుందిరా" అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇక కావ్య శ్రీముఖిని చూసి "ఏంటి నీకు నిజంగా అబ్బాయి కావాలా" అని అడిగింది చిరాకు మొహంతో.