English | Telugu

Karthika Deepam2 : మామయ్య అక్రమ సంబంధం చూసి జ్యోత్స్న షాక్.. ఆమె ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -154 లో..... కార్తీక్ దగ్గరికి దీప వస్తుంది. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ మీ అమ్మగారికి నిజం చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుందని దీప అనగానే.. మా నాన్నని దేవుడు అనుకుంటుంది అమ్మ.. ఇప్పుడు ఈ విషయం చెప్తే తట్టుకోలేదని కార్తీక్ అంటాడు. నిజం ఎప్పటికైనా తెలుస్తుందని కాంచన అంటుంది. అంతా వినేసిందా అని కార్తీక్ , దీపలు టెన్షన్ పడుతారు. ఏంటి ఏదో నిజం తట్టుకోలేదనుకుంటున్నారని కాంచన అంటుంది. అదేం లేదని కార్తీక్ డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత అమ్మ మీకు ఇలా కాళ్ళు లేకున్నా గుండె దైర్యంతో బ్రతుకుతున్నారు. అదే మనసుకి గాయమైతే తట్టుకుంటారా అని దీప అడుగుతుంది. 

ఆదితో సుస్సు పోయించిన శేఖర్ మాష్టర్

ఢీ డాన్స్ షోలో డాన్స్ తో సమానంగా ఆది కామెడీ కూడా పీక్స్ లో ఉంటోంది ఈ మధ్య. ఐతే ఈ షోలో శేఖర్ మాష్టర్ ఇచ్చిన ఛాలెంజ్ లో ఆది ఓడిపోయాడు. దాంతో ఆదిని బట్ట బుర్రతో షోకి రమ్మని పిలిచారు. ఐతే వైట్ హెయిర్ విగ్ పెట్టుకుని ముసలివాడు గెటప్ లో వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఐతే శేఖర్ మాష్టర్ చెప్పినట్టు చేసాడు ఆది. మోకాళ్ళ మీద కూర్చుని మైథిలి దగ్గరకు, జాను దగ్గరకు పంపించి "మానవరాలా బాగున్నారా" అని మాట్లాడించాడు. తాతయ్య అక్క పిలుస్తోంది అంటూ మైథిలి హన్సిక వైపు చూపిస్తే..."నేను తాతయ్య ఐతే హన్సిక నీకు అమ్మమ్మ అవుతుంది" అన్నాడు. దానికి హన్సిక కామెడీగా ఫైర్ అయ్యింది. చంపేస్తా ఆది అంది.

ఎంత అరిస్తే అంత లేస్తుంది...

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రతీ వారం వెరైటీ సెగ్మెంట్స్ తో ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఇందులో రష్మీ పెట్టె కాన్సెప్ట్స్ కి ఎవ్వరైనా పడీపడీ నవ్వాల్సిందే. అలాంటి ఒక కాన్సెప్ట్ ని రష్మీ డిజైన్ చేసింది "అదే ఎంత అరిస్తే అంత లేస్తుంది" అంటే ఇందులో బూతేమీ లేదు. ఈ షోలో ఆది అండ్ టీమ్ తో ఈ గేమ్ ఆడించింది. ముందు ఉమాదేవిని పిలిచింది రష్మీ .. గట్టిగా అరవమని చెప్పింది. అలా ఎంత గట్టిగా అరిస్తే అంతలా ఆ స్పీకర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అదన్నమాట అసలు రష్మీ మాటకు అర్ధం. ఐతే ఉమాదేవి హాఫ్ సెంచరీ దాటేలా అరిచింది. ఆ తర్వాత వీణాని పిలిచాడు ఆది. ఒక్క గట్టి అరుపుతో 50 స్కోర్ చేసింది. దాంతో ఆది వేసిన డైలాగ్ మాములుగా లేదు. "ఒక్క అరుపుకే 50 కొట్టావంటే" అన్నాడు. దానికి సిగ్గుపడిపోయింది వీణ. తర్వాత మళ్ళీ అరిచి 80 స్కోర్ కొట్టింది. ఫైనల్ గా మహతిని  పిలిచాడు.

పృథ్వీ లఫూట్ గేమ్ స్టార్ట్ చేశాడు.. వార్నింగ్గా బొక్కా!

బిగ్ బాస్ హౌస్ లో సీజన్-5 లోని టాస్క్ ని తీసుకొచ్చాడు బిగ్ బాస్ అదే ప్రభావతి గేమ్. ఈ సారి ప్రభావతి (కోడి) 2.0 గా కాస్త బొద్దుగా ఎంట్రీ ఇచ్చింది. నేను అప్పుడప్పుడు గుడ్లను పంపిస్తాను. వాటిని జాగ్రత్తగా కాపాడాలి.. ఏ టీమ్ అయితే ఎక్కువ గుడ్లు తిరిగి ఇస్తారో వాళ్లకి కొన్ని ప్రయోజనాలు లభిస్తాయంటూ ప్రభావతి చెప్పింది. దీంతో బుట్టలు పట్టుకొని కంటెస్టెంట్స్ రెడీ అయిపోయారు. ఈ టాస్కు మొదలుకాగానే పృథ్వీ అయితే రెచ్చిపోయాడు. ఆడ మగా తేడా లేకుండా ఒక్కొక్కరిని విసిరి పారేశాడు. దీంతో పృథ్వీని ఆపడానికి నబీల్, అభయ్, ఆదిత్య ముగ్గురూ ట్రై చేశారు. ఇక మధ్యమధ్యలో యష్మీ కూడా ట్రై చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన పృథ్వీ.. ఆదిత్య మెడ పట్టుకొని ఓ పక్కకి విసిరేశాడు. దీంతో మీరు నా నెక్ ప్రెస్ చేసి తిప్పేశారు.. ఇది కరెక్ట్ కాదంటూ ఆదిత్య కాసేపు అరిచాడు. అయిన సరే పృథ్వీ వెనక్కి తగ్గలేదు. ఇక పృథ్వీని సోనియా కమాన్ కమాన్ అంటు రెచ్చగొట్టింది.

Brahmamudi : ఏ భర్త ఇవ్వని ఆఫర్ భార్యకి ఇచ్చిన రాజ్..  షాక్ లో కావ్య!

స్టార్ మా టీవీలో  ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -518 లో.....ఇందిరాదేవి సీతారామయ్యలు కావ్య దగ్గరికి వస్తారు. తను రానని చెప్పడంతో తిరిగివెళ్ళిపోతారు. ఇద్దరు తిరిగి ఇంటికి వెళ్లేసరికి అందరూ కావ్య కోసం వెయిట్ చేస్తుంటారు. కావ్య రాకపోవడంతో ఆ మహారాణి ఎక్కడ కార్ లో ఉందా కార్ డోర్ నేనే తీసి తనని తీసుకొని రావాలా అని రాజ్ వెటకారంగా మాట్లాడతాడు. కావ్య ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. రానని చెప్పిందని ఇందిరాదేవి చెప్తుంది. నాకు తెలుసు తనకి పొగరు అని నేను ఇప్పుడు వెళ్లి కాళ్ళు పట్టుకొని రమ్మని బ్రతిమాలాలా అని రాజ్ అంటాడు. నువ్వు వెళితే కావ్య వస్తుందని ఇందిరాదేవి చెప్తుంది.

Eto Vellipoyindhi Manasu : యాగం ఆపడానికి దుష్టశక్తులు ప్రయత్నం.. మరి అది జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 204 లో.....యాగం ఆపాలని శ్రీవల్లి, సందీప్, శ్రీలతలు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. శ్రీలత యాగం పనులు చేస్తుంటే.. మాణిక్యం వద్దని అనడం తో మాణిక్యాన్ని రెచ్చగొట్టి యాగం ఆపాలని శ్రీవల్లి అనుకుంటుంది. మాణిక్యంతో మా అత్తయ్యతో అలా అంటావా అని అంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. చూడండి బావ గారు అత్తయ్యని అలా అన్నాడంటూ చెప్తుంది.. నేను అలా అనలేదని మాణిక్యం అంటాడు. అప్పుడే స్వామిజీ కలుగుజేసుకుని అలా అంటే తప్పేంటి ఇది పవిత్రమైంది.. అందుకే అందరు ముట్టుకోకుడదు అన్నాడని అనగానే.. అందరు సైలెంట్ అయిపోతారు.