English | Telugu

‘టాక్సిక్‌’.. పవర్‌ఫుల్‌ టైటిల్‌తో మరో సెన్సేషన్‌కి రెడీ అయిన యశ్‌!

కెజిఎఫ్‌ చాప్టర్‌ 1, కెజిఎఫ్‌ చాప్టర్‌ 2 వంటి బ్లాక్‌బస్టర్స్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్‌ నెక్స్‌ట్‌ చేయబోయే సినిమాపైనే అందరి దృష్టీ ఉంది. 2018లో కెజిఎఫ్‌1 రిలీజ్‌ కాగా, 2022 ఏప్రిల్‌లో కెజిఎఫ్‌ 2 విడుదలైంది. ఈ సినిమా విడుదలై ఏడాదిన్నర కావస్తున్నా యశ్‌ తదుపరి సినిమాపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే ఇటీవల తన 19వ సినిమాను గీతు మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

నటిగా, దర్శకురాలిగా ఎన్నో అవార్డులు అందుకున్న గీతు మోహన్‌ దాస్‌ 2014లో హిందీలో రూపొందించిన లియర్స్‌ డైస్‌ చిత్రాన్ని ఇండియా తరఫున ఆస్కార్‌కు పంపారు. అయితే ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్‌ అవ్వలేదు. కెజిఎఫ్‌ 2 తర్వాత మంచి కథ కోసం ఎంతో గ్యాప్‌ తీసుకున్న యశ్‌ ఫైనల్‌గా గీతు కథతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కోసం యశ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు డిసెంబర్‌ 8న యశ్‌ కొత్త సినిమా టైటిల్‌ను ఎనౌన్స్‌ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘టాక్సిక్‌’ పేరుతో ఈ సినిమా రూపొందనుంది.

ఏప్రిల్‌ 10, 2025లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు రిలీజ్‌ డేట్‌ను కూడా ఎనౌన్స్‌ చేశారు. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌ అన్న ట్యాగ్‌ లైన్‌ ను కూడా టైటిల్‌కి యాడ్‌ చేశారు. ఇది టైటిల్‌ అనౌన్స్‌మెంటే అయినప్పటికీ ఆ వీడియోలో యశ్‌ లుక్‌ను కూడా రివీల్‌ చేశారు. టాక్సిక్‌ పేరు బ్యాక్‌గ్రౌండ్‌లో తుపాకీతో యశ్‌ కనిపించారు. ఈ చిత్రాన్ని కేవీన్‌ఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఈ మూవీ తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్‌తో పాటు ఇతర వివరాలను మేకర్స్‌ వెల్లడిరచలేదు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళబోతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.