English | Telugu

టాలీవుడ్ కి మరో రాజమౌళి దొరికినట్లేనా!

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఎదగనున్నాడా అంటే, ఆయన అడుగులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అంటే.. ముందుగా ఎస్.ఎస్. రాజమౌళి పేరు గుర్తుకొస్తుంది. 'బాహుబలి' ఫ్రాంచైజ్, 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచస్థాయిలో సంచనాలు సృష్టించాడు. అయితే రాజమౌళి ఒక్కో సినిమాకి ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' విడుదలై ఏడాది దాటిపోయింది. మహేష్ బాబుతో చేయనున్న తన తదుపరి చిత్రం మొదలు కావాలంటే మరో ఏడాది పట్టే అవకాశముంది. ఇక ఆ సినిమా విడుదల కావాలంటే మూడు నాలుగేళ్లు పట్టినా ఆశ్చర్యంలేదు. ఈ గ్యాప్ లో ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించేలా ఉన్నాడు.

'ఉగ్రం' అనే విజయవంతమైన కన్నడ చిత్రంతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్.. 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించి, కన్నడ సినిమా స్థాయిని మరోస్థాయికి తీసుకెళ్లాడు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ దృష్టి అంతా టాలీవుడ్ మీదే ఉంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో వరుస భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. పైగా 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ కోసం ఎక్కువ సమయం తీసుకున్న నీల్, ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచేశాడు. ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' చేస్తున్నాడు. దాని తర్వాత 'ఎన్టీఆర్ 31' చేయనున్నాడు. అలాగే 'సలార్' రెండో భాగం కూడా ఉందని ఇన్ సైడ్ టాక్. వీటితో పాటు డీవీవీ దానయ్య నిర్మాణంలో రామ్ చరణ్ తో ఓ సినిమా, దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ తో మరో సినిమా కమిట్ అయ్యాడని సమాచారం. ఇలా టాలీవుడ్ హీరోలతో వరుస భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు నీల్. మహేష్ తో రాజమౌళి చేయనున్న 'ఎస్ఎస్ఎంబి 29' విడుదలయ్యే లోపు, నీల్ డైరెక్ట్ చేసిన సినిమాలు కనీసం రెండు మూడు విడుదలయ్యే అవకాశాలున్నాయి. కన్నడ చిత్రం 'కేజీఎఫ్-2'తోనే 1000 కోట్ల క్లబ్ లో చేరాడు నీల్. అలాంటిది టాలీవుడ్ స్టార్స్ తో పాన్ ఇండియా సినిమాలు అంటే.. పాజిటివ్ టాక్ వస్తే చాలు 1000 కోట్లు అనేది చాలా చిన్న విషయం అవుతుంది. అప్పుడు టాలీవుడ్ లో నీల్ పేరు మారుమోగిపోతుంది అనడంలో సందేహం లేదు. మరి ముందు ముందు టాలీవుడ్ లో ప్రశాంత్ నీల్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .