English | Telugu

'విరూపాక్ష'కి అదిరిపోయే ఓపెనింగ్స్.. కానీ 'విన్నర్' కంటే తక్కువే!

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ థ్రిల్లర్ 'విరూపాక్ష'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ సినిమా ఏప్రిల్ 21 న విడుదలైంది. ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. మొదటిరోజు కలెక్షన్లు పరంగా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో రెండో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.5.65 కోట్ల షేర్ తో 'విన్నర్' టాప్ లో ఉండగా.. ఇప్పుడు రూ.4.79 కోట్ల షేర్ తో విరూపాక్ష సత్తా చాటింది. సాయి ధరమ్ తేజ్ నటించిన గత మూడు నాలుగు చిత్రాలను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో అవి 2-3 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టగా.. విరూపాక్ష దాదాపు డబుల్ షేర్ రాబట్టడం విశేషం.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు నైజాంలో రూ.1.82 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.54 లక్షలషేర్, ఆంధ్రాలో రూ.2.43 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన విరూపాక్ష.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.4.79 కోట్ల షేర్ సాధించింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.36 లక్షలషేర్, ఓవర్సీస్ లో రూ.1.20 కోట్ల షేర్ కలిపి.. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.6.35 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవరాల్ గా రూ.22.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా మొదటిరోజు 28 శాతానికి పైగా రికవర్ చేసింది. సినిమాకి హిట్ టాక్ రావడంతో పాటు ప్రస్తుతం ఇతర సినిమాల పోటీ లేకపోవడం, వేసవి సెలవులు కావడం వంటి అంశాలు కలిసొచ్చి తొలి వారంలోనే ఈ చిత్రం లాభాల్లోకి ఎంటరయ్యే అవకాశముంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .