English | Telugu

పాముని రెండు ముక్కలుగా చేసి విక్రమ్ అరాచకం

తన సినిమా కెరీర్ బిగినింగ్ నుంచి చాలా విబిమన్నమైన చిత్రాలని చేసే హీరో విక్రమ్. తెలుగులోనూ,తమిళంలోనూ సమానమైన క్రేజ్ ని కలిగివున్న విక్రమ్ ని అభిమానులందరూ చియాన్ అని పిలుచుకుంటారు. చియాన్ అనే పదానికి గాడ్, పెద్దవ్యక్తి అనే పేర్లు కూడా ఉన్నాయి. అలాగే విక్రమ్ గతంలో నటించిన సేతు మూవీలో విక్రమ్ క్యారక్టర్ పేరు చియాన్. అప్పటినుంచి విక్రమ్ ని చియాన్ అని అభిమానులు పిలుస్తుంటారు. లేటెస్ట్ గా విక్రమ్ తంగలాన్ అనే ఒక డిఫరెంట్ మూవీ ని చేస్తున్నాడు. ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యి ఇండియన్ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని షేక్ చేస్తుంది.

విక్రమ్ నుంచి వస్తున్న తాజా చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఆ చిత్రం నుంచి వచ్చిన టీజర్ అదిరిపోయింది. ఒంటి మీద కేవలం తెల్లని పంచ మాత్రమే ధరించి అదికూడా గోచి లాగా కట్టుకొని విక్రమ్ క్యారెక్టర్ ఉంది. విక్రమ్ గెటప్ తో పాటు దర్శకుడు రంజిత్ చూపించిన వాతావరణం మొత్తాన్ని చూస్తుంటే పాత కాలం నాటి మనుషులుకి సంబంధించిన కథ అని తెలుస్తుంది. విక్రమ్ జుట్టు కూడా దాదాపు తన కాళ్ళ దగ్గర దాకా వేలాడుతూ ఉంది. అలాగే విక్రమ్ ఒక పెద్ద పాముని చేత్తో రెండు ముక్కలుగా చెయ్యడం ఒళ్ళు గగుర్లు పుట్టించేలా ఉంది. అలాగే విక్రమ్ వీరోచితంగా కత్తితో పోరాడటం కూడా సూపర్ గా ఉంది. మాళవిక మోహన్,పార్వతి, పశుపతి లాంటి ఆర్టిస్ట్ లు కూడా టీజర్ లో కనపడ్డారు. టీజర్ చూసిన తర్వాత అభిమానులందరూ ఈ సారి మా చియాన్ ఇండియన్ చిత్ర పరిశ్రమలో సరి కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు.

మొదటి నుంచి విక్రమ్ నటించే ఒక సినిమాకి ఇంకో సినిమాకి పోలిక ఉండదు. తన ప్రతి సినిమాలో కూడా కొత్త రకం గెటప్ ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తాడు. కర్ణాటక లో ఉన్న బంగారు గనుల నేపథ్యం లో తంగలాన్ చిత్రం రూపుదిద్దుకుంటుంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న తంగలాన్ వచ్చే సంవత్సరం జనవరి 26 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. పొన్నియన్ సెల్వమ్ తర్వాత వస్తున్న తంగలాన్ మూవీ మీద చియాన్ అభిమానులు భారీ ఆశలనే పెట్టుకున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.