English | Telugu

మెగా విక్టరీ మాస్ సాంగ్.. సంక్రాంతి వైబ్ ముందే వచ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), విక్టరీ వెంకటేష్(Venkatesh) కలిసి చిందేస్తే.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. 'మన శంకర వరప్రసాద్ గారు'తో ఆ అద్భుతాన్ని సాధ్యం చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా ఈ సినిమా నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ విడుదలైంది. (Mana Shankara Varaprasad Garu)

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'మన శంకర వరప్రసాద్ గారు'లో వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల, శశిరేఖ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్ గా మెగా విక్టరీ మాస్ సాంగ్ వచ్చింది. (Mega Victory Mass Song)

చిరంజీవి, వెంకటేష్ లపై చిత్రీకరించిన పార్టీ సాంగ్ ఇది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందరూ కాలు కదిపేలా ఎనర్జిటిక్ గా ఉంది. "మార్నింగ్ గ్రీన్ టీ.. నైట్ అయితే నైన్టీ.. ఎవడైతే ఏంటి" అంటూ క్యాచీ లిరిక్స్ తో అందరూ పాడుకునేలా పాటను రాశారు కాసర్ల శ్యామ్. "ఏంది బాసు సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి..." వంటి లైన్స్ ఫ్యాన్స్ హమ్ చేసుకునేలా ఉన్నాయి. ఆ మ్యూజిక్, లిరిక్స్ కి తగ్గట్టుగా సింగర్స్ నాకాష్ అజిజ్, విశాల్ దద్లాని ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ గా ఆలపించారు.

ఇక లిరికల్ వీడియోలో చిరంజీవి, వెంకటేష్ కలిసి స్టెప్పులేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా సంక్రాంతికి వైబ్ కి తగ్గట్టుగా ఇద్దరూ పంచెకట్టుతో కనిపించడం అదిరిపోయింది. మెగా, విక్టరీ ఫ్యాన్స్ కి ఈ సాంగ్ బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.