English | Telugu

వెండితెర‌పై మ‌ళ్లీ విజ‌య‌శాంతి

ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా చ‌లామ‌ణీ అయిన విజ‌య‌శాంతి.. ఆ త‌ర‌వాత మ‌హిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో న‌టించి పేరు తెచ్చుకొంది. రాజ‌కీయాల్లో బిజీ అయ్యాక సినిమాల గురించి ఆలోచించ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఆమె మేక‌ప్ వేసుకోబోతోంద‌ని స‌మాచార‌మ్‌. బి.గోపాల్‌-గోపీచంద్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. న‌య‌న‌తార క‌థానాయిక‌. ఈ చిత్రంలో విజ‌యశాంతి ఓ కీల‌క‌మైన పాత్ర పోషించ‌బోతున్న‌ట్టు టాక్‌. నిజానికి సినిమాలంటే అంత‌గా ఆసక్తి చూపించ‌ని విజ‌య‌శాంతి.. బి.గోపాల్ కోరిక మేర‌కే ఇందులో న‌టించ‌డానికి ఒప్పుకొంద‌ని తెలుస్తోంది. ఎప్పుడో సాహ‌సం సినిమాకంటే మొద‌లైన సినిమా ఇది. ఆర్థిక కార‌ణాల వ‌ల్ల మ‌ధ్య‌లో ఆగిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ ప‌ట్టాలెక్కుతోంది. విజ‌య‌శాంతి రాక‌తో ఈ సినిమాలో స్పెష‌లాఫ్ ఎట్రాక్ష‌న్ చేరిన‌ట్టే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.